Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , వివిధ శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ దేశం లోనే నెంబర్ 1 స్థానం లో ఉంది. ఈ రెండేళ్ల కాలం లో ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని కూడా ఆ శాఖకి రప్పించేలా పని చేశారు పవన్ కళ్యాణ్. అదే విధంగా పర్యావరణ శాఖపై ఆయన ప్రత్యేక ద్రుష్టి పెడుతూ , వచ్చే ఏడాది లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక అటవీ శాఖ కి సంబంధించి ఆయన ఎలాంటి మార్కు చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ పవన్ కళ్యాణ్ పాలనలో 80 శాతం తగ్గింది. అంతే కాదు అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే రైతుల పొలాల్లోకి ఏనుగులు ప్రవేశించి పంటలను ద్వంసం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ , కర్ణాటక రాష్ట్రము నుండి రెండు కుంకీ ఏనుగులను తెప్పించారు. వీటి ద్వారా ఇది వరకు ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ ని నిర్వహించారు. అయితే మన ఆంధ్ర ప్రదేశ్ లో పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర నుండి రెండు ఆడపులులను రప్పిస్తున్నారు. ఈమేరకు నిన్న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తో భేటీ అయ్యారు. ఆయన పులులను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే వీటిని ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా చెప్పనున్నారు. ఇలా తన శాఖలన్నిటికీ సంపూర్ణ న్యాయం చేస్తూ, నాయకుడు అంటే ఎలా ఉండాలో అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై అభిమానుల్లో కాస్త ఆందోళన వాతావరణం నెలకొంది.
చాలా కాలం నుండి భుజాల నొప్పితో బాధ పడుతున్న ఆయన, నిన్న ముంబై లోని ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మహారాష్ట్ర సీఎం తో భేటీ అయ్యారు. వైద్యులు పవన్ కళ్యాణ్ ని తక్షణమే సర్జరీ చేయించుకోవాలని , గాయం తీవ్ర రూపం దాల్చిందని అంటున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత , సర్జరీ చేయించుకుంటానని ఆయన డాక్టర్లకు చెప్పారట. దీంతో అభిమానుల్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల కాస్త టెన్షన్ మొదలైంది. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రం షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఒకపక్క రాజకీయంగా , మరోపక్క సినిమాల పరంగా ఫుల్ యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే పరిస్థితి ఏంటి?, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీస్తున్నారు.
