ఆంధ్రప్రదేశ్‌Modi Amravati Visit: అమరావతిలో ఏర్పాట్లు షురూ.. ప్రధాని మోడీ ఫుల్ షెడ్యూల్ విడుదల!

Modi Amravati Visit: అమరావతిలో ఏర్పాట్లు షురూ.. ప్రధాని మోడీ ఫుల్ షెడ్యూల్ విడుదల!

Modi Amravati Visit: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మే 2న అమరావతిలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. అశేష జనవాహిని నడుమ అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉప సంఘం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు కేంద్ర బలగాలు సైతం అమరావతిని సందర్శించాయి. నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తిగా మారింది.

Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!

* ప్రధాని పర్యటన ఇలా
మే 2న ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో మూడున్నర గంటలకు అమరావతి లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ల మేరా రోడ్డు షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఈ రోడ్ షో ఉంటుంది. 3:45 గంటల నుంచి నాలుగు గంటల వరకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు సభ నిర్వహిస్తారు. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని ప్రసంగం ఉంటుంది. సభను ముగించుకుని సాయంత్రం 5:10 గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. 5:20 కి గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు ప్రధాని మోదీ.

* మూడు వేదికలు సిద్ధం..
ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వివిఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. ప్రధాని సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజల రాకపోకల కోసం 8 రోడ్లను, 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సభకు రావడానికి వీలుగా ఈ-11, ఈ- 13, ఈ -15 రోడ్లతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని సిఆర్డిఏ అధికారులను ఆదేశించారు.

* రెండోసారి శంకుస్థాపన..
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడం ఇది రెండోసారి. 2017లో తొలిసారిగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్వీర్యంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త రూపు వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గత పది నెలలుగా నిధుల సమీకరణ జరిగింది. అది ఒక కొలిక్కి రావడంతోనే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 

Also Read: వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Amaravati Outer Ring Road: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కీలక మార్పు!

Amaravati Outer Ring Road: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇంకోవైపు ఔటర్ రింగ్...

Amaravati Farmers: అమరావతి రైతుల కోసం సంచలన నిర్ణయం!

Amaravati Farmers: అమరావతి ( Amravati capital ) రైతుల విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతులకు లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయిస్తోంది. తాజాగా...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version