Homeఆంధ్రప్రదేశ్‌MS Dhoni Amaravati: అమరావతికి ఎంఎస్ ధోని.. కీలక బాధ్యతలు?

MS Dhoni Amaravati: అమరావతికి ఎంఎస్ ధోని.. కీలక బాధ్యతలు?

MS Dhoni Amaravati: అమరావతి రాజధానిని( Amravati capital ) అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఒక్క రాజధాని అన్న భావన లేకుండా.. పర్యాటకంగా, క్రీడల పరంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సాధారణంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు.. కేవలం పనుల మీద వెళ్లిన వారు తక్కువ. పర్యాటక ప్రాంతాలను చూడాలని, క్రీడా పరమైన పోటీలను చూడాలని వెళ్లేవారు ఉండేవారు. అటువంటి పరిస్థితి అమరావతి రాజధానికి కూడా తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడా మైదానం నిర్మించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రపంచంలో మేటి భారత క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రాజధాని ప్రాంతంలో రెండు రోజులు పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో ప్రత్యేక భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* అంతర్జాతీయ స్పోర్ట్స్ విలేజ్..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలి అన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. అయితే అదనంగా కొన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు భూ సమీకరణ చేయాలని ఖాజాగా నిర్ణయించుకుంది ఏపీ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాలన్నది ప్రధాన ఆలోచన. అందులో భాగంగా అతిపెద్ద స్టేడియం తో పాటు క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ కెప్టెన్ ధోని సంప్రదించి అమరావతి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మహేంద్రసింగ్ ధోనీని క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరి అవకాశం ఉంది. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం.

* ఏపీ ప్రభుత్వ అంబాసిడర్ గా..
గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం క్రీడా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం క్రీడాకారుల విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు. ఆయన ప్రోత్సాహంతోనే ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రణాళిక వేస్తోంది కూటమి ప్రభుత్వం. మొన్న ఐసీసీ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ఆతిథ్య మ్యాచ్ ఘనంగా జరిగింది. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జై షా కూడా విచ్చేశారు. ముంబైలో ఫైనల్ మ్యాచ్ ను జై షా తో కలిసి తిలకించారు లోకేష్. అయితే ఇప్పుడు మహేంద్రసింగ్ ధోని అమరావతిలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ధోనిని ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ను ప్రోత్సహించి అకాడమీ ప్రారంభించేలా చేసారు చంద్రబాబు. అటు తరువాత ఒలింపిక్స్ విజేత పీవీ సింధును కూడా ప్రభుత్వం ప్రోత్సహించి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. ఇప్పుడు ధోనీతో మరో ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version