Homeఆంధ్రప్రదేశ్‌Jagan Convoy Accountability Case: జగన్‌పై చర్యలు – బాబు సమయంలో ఏం జరిగింది?

Jagan Convoy Accountability Case: జగన్‌పై చర్యలు – బాబు సమయంలో ఏం జరిగింది?

Jagan Convoy Accountability Case: ఆంద్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌పీసీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవలి పల్నాడు పర్యటనపై వివాదం కొనసాగుతోంది. మొదట పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఓ యువకుడు రప్ప.. రప్ప నరుకుతా అని ప్లకార్డు ప్రదర్శించాడు. దానిపై అధికార, విపక్ష పార్టీల మధ్య రచ్చ జరుగుతుండగానే ఓ వృద్దుడు కాన్వాయ్‌ కారుకింద పడి మరణించడం.. తర్వాత వృద్ధుడు పడింది జగన్‌ కారే అని వీడియోలు బయటకు రావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి జగన్‌పై ఏపీ పోలీసులు ఏ2గా పేర్కొనడం రాజకీయ, న్యాయ చర్చలకు దారితీసింది.

జగన్‌ కాన్వాయ్‌ కింద వృద్ధుడు పడి మరణించడం ద్వారా జగన్‌మోహన్‌ రెడ్డి కాన్వాయ్‌పై ఆరోపణలు రావడం జరిగింది. న్యాయపరంగా, ఒక నాయకుడు తన కాన్వాయ్‌లోని వాహనాల చర్యలకు ఎంతవరకు బాధ్యత వహించాలి? ఈ సంఘటనలో జగన్‌ను నిందితుడిగా పేర్కొనడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలు నీతి, నిర్లక్ష్యం, మరియు బాధ్యతల సమస్యలను లేవనెత్తుతున్నాయి. న్యాయస్థానం ఈ కేసును ఎలా విచారిస్తుందనేది భవిష్యత్తులో రాజకీయ నాయకుల బాధ్యతను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు.

Also Read: Chintamaneni Prabhakar: చంద్రబాబు సీరియస్.. చింతమనేని రాజీనామా?.. అంబటి రాంబాబు పై కేసు!

భిన్న కోణాలు..
ఈ ప్రమాదంలో భిన్న కోణాలు ఉన్నాయి. కారు నడిపింది ప్రభుత్వ డ్రైవర్‌ కాబట్టి అతనిపై కేసు పెట్టాలి కానీ, జగన్‌పై కేసు ఎలా పెడతారనివైసీపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, జగన్‌ టూర్‌కు ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. అయితే ఆంక్షలు విధించినప్పుడు వాటిని పాటించకుండా.. అతిక్రమించడమే కాకుండా ప్రమాదానికి కారణం కావడం నేరమే కదా అని అధికార కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఇక రోప్‌ పార్టీ విషయానికి వస్తే.. జగన్‌ ఎక్కడ పడితే అక్కడ ఆగడం, పర్యటన షెడ్యూల్‌లో లేకపోవడం కూడా రోప్‌ పార్టీ పోలీసులకు ఇబ్బందిగా మారింది.

గత ఘటనల గురించి ప్రస్తావన..
ఇక వైపీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దెందలూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. కానీ, పోలీసులు నాడు టీడీపీ నేతలపై కేసు పెట్టారు. చంద్రబాబుపై కాదు. ఇదే అంశం ప్రస్తావిస్తున్నారు. అయితే ఘటన స్థలంలో చంద్రబాబు ఉన్నా.. ప్రత్యక్షంగా ఆయన కారణం కాలేదు. కానీ, ఇక్కడ జగన్‌ కారులో ఉండడం, ఆంక్షలు పాటించకపోవడంతో పోలీసులు కేసు పెట్టారు.

Also Read: Jagan Court Case Update: అవి జీవిత ఖైదు సెక్షన్లే.. జగన్ జైలుకు వెళ్లక తప్పదా?

రాజకీయ నాయకుల బాధ్యతలు..
రాజకీయ నాయకులు తమ పర్యటనల సమయంలో భద్రతా ఏర్పాట్లను ఎంతవరకు పర్యవేక్షించాలి? కాన్వాయ్‌లోని డ్రైవర్లు, భద్రతా సిబ్బంది చర్యలకు నాయకుడు బాధ్యత వహించాలా? ఈ ఘటన రాజకీయ కార్యకలాపాల సమయంలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలను పరిశీలిస్తే, నాయకులపై నేరపరమైన ఆరోపణలు చేయడం అరుదైనప్పటికీ, ఈ కేసు ఒక కొత్త దృష్టాంతాన్ని సృష్టించవచ్చు.

రాజకీయ పరిణామాలు..
ఈ ఘటన రాజకీయంగా వైఎస్సార్‌సీపీ, జగన్‌మోహన్‌ రెడ్డి ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందా? ప్రజల దృష్టిలో ఈ ఘటన నాయకుల బాధ్యతాయుతమైన ప్రవర్తనపై కొత్త చర్చను రేకెత్తిస్తుంది. సోషల్‌ మీడియా వేదికలలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలు రాజకీయ నాయకులు తమ కార్యకలాపాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

ఈ ఘటన రాజకీయ నాయకులు తమ కాన్వాయ్‌లు, భద్రతా ఏర్పాట్లపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. న్యాయపరమైన దృక్కోణంలో ఈ కేసు నాయకుల జవాబుదారీతనం గురించి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అదే సమయంలో, రాజకీయంగా ఈ ఘటన వైసీపీ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular