spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rushikonda: శత్రు దుర్భేద్యంలో సామాన్యులకు ప్రవేశం!

Rushikonda: శత్రు దుర్భేద్యంలో సామాన్యులకు ప్రవేశం!

Rushikonda: విశాఖకు ల్యాండ్ మార్క్ రుషికొండ. నగరానికి వచ్చేవారు తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. మెలికలు తిరిగే రోడ్లు, పర్యాటక భవనాలు రుషికొండ సొంతం. కానీ గత ఐదు సంవత్సరాలుగా రుషికొండ ప్రాంతంలో సందర్శనలు నిలిచిపోయాయి.సామాన్యుడు నుంచి ఉన్నత వర్గాల వరకు ఎవరికీ అక్కడ సందర్శించేందుకు అనుమతి లేదు. అత్యంత భద్రత వలయంతో నిర్మాణాలు చేపట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రు దుర్భేద్యంగా దీనిని తీర్చిదిద్దారు.నిర్మాణాలు కొనసాగిన సమయంలో మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. విపక్ష నేతలు సందర్శించినప్పుడు పోలీసులతో ఉక్కు పాదం మోపారు. కానీ రోజులు ఒకేలా ఉండవు. అధికారం తారుమారు అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. పవర్ పోవడంతో సామాన్యుడు రుషికొండ భవనాల్లో అడుగు పెట్టగలిగాడు.

సాగర తీరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రుషికొండ విరాజిల్లేది. పర్యాటక చరిత్ర పటంలో రుషికొండది ప్రత్యేక స్థానం. కానీ ఆ కొండను తొలిచి.. వైసిపి ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. పర్యావరణాన్ని చిత్రం చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టినా.. పర్యావరణ ప్రేమికులు నెత్తి నోరు బాదుకున్నా వినకుండా జగన్ సర్కార్ ముందుకు పోయింది. అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. ‘చెట్టు పోతే పెంచగలం.. కొండ కొట్టేస్తే పెంచడం సాధ్యమేనా’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయినా జగన్ మారలేదు. దాదాపు 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టారు. విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అదేమంటే ప్రభుత్వ అవసరాల కోసమని అప్పట్లో వైసీపీ పెద్దలు తీర్పు చెప్పారు.

పచ్చదనానికి మచ్చుతునకగా నిలిచి రుషికొండను తొలిచారు. న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కృత్రిమ పచ్చని తివాచీని పరిచారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కాకిని కూడా అక్కడ వాలనివ్వలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిడిపి అధికారంలోకి వచ్చింది. రుషికొండపై ఆంక్షలు ఎత్తివేసింది. ఒకప్పుడు డిసిపి స్థాయి అధికారిని, పదిమంది సీఐలను అక్కడ నిర్మించేవారు. ఈగ వాలితే కేసుపెట్టేవారు. సిపిఐ నారాయణ వంటి వారు కూడా దిక్కుతోచక వెనుదిరిగారంటే ఏ స్థాయిలో అక్కడ భద్రత వలయం సృష్టించేవారో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు సామాన్యుడు సైతం రుషికొండలో అడుగుపెట్టడం అభినందనీయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Oktelugu Epaper
Exit mobile version