Homeఆంధ్రప్రదేశ్‌Kodi Kathi Case: కోడి కత్తి కేసు నిందితుడు ఆరోగ్యం పై ఆందోళన

Kodi Kathi Case: కోడి కత్తి కేసు నిందితుడు ఆరోగ్యం పై ఆందోళన

Kodi Kathi Case: విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? కోడి కత్తి కేసు నిందితుడు దీక్షలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు. అటువంటిదేమీ లేదని జైలు అధికారులు ప్రకటించారు. జైల్లో శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని చెబుతున్నారు. మరోవైపు ములాఖత్ లో గుర్తు తెలియని వ్యక్తులు కలిశారని.. వారు ఎవరో చెప్పాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. జైలులో శ్రీనివాసరావు ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు. దీనిపై జైలు అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. కానీ జగన్ మాత్రం లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. సాక్ష్యం చెప్పేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీంతో నిందితుడు శ్రీనివాసరావుకు జైలు నుంచి విముక్తి లభించడం లేదు. కనీసం బెయిల్ కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు తో పాటు ఆయన తల్లి, సోదరుడు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి జైల్లో శ్రీనివాసరావు.. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. కుటుంబ సభ్యుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కానీ శ్రీనివాసరావు విషయంలో మాత్రం స్పష్టత లేదు.

శ్రీనివాసరావు దీక్షను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. జైలు వద్ద దళిత సంఘాల నేతలు ప్రదర్శించడం, ములాఖత్ కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తరువాత భద్రతను కట్టుదిట్టం చేశారు. దళిత సంఘాల ప్రతినిధులతో శ్రీనివాసరావు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేందుకు ఓ అధికారిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో జైలు అధికారుల ప్రకటనలు సైతం భిన్నంగా ఉన్నాయి. జైలులో శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. అంతకుముందే ములాఖత్ లో కలిసిన దళిత సంఘాల ప్రతినిధులకు తాను దీక్షలో ఉన్నట్లు శ్రీనివాసరావు చెప్పాడు. అక్కడకు కొద్ది సమయానికి అధికారులు అటువంటిదేమీ లేదని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.

జైల్లో ఉన్న ఖైదీలను కలిసేందుకు వారానికి రెండు సార్లు అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే బంధుమిత్రులు కలుస్తారు. అయితే విశాఖకు చెందిన దళిత సంఘం ప్రతినిధి ఒకరు శ్రీనివాసరావును కలిశారు. కానీ ములాఖత్ జాబితాలో రెండో పేరు ఒకటి కనిపిస్తోంది. అలా కలిసింది ఎవరు? ఏమిటి? అనే దానిపై స్పష్టత లేదు.ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఆరోగ్యం పై హెల్త్ బుల్లెట్ విడుదల చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version