Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: అప్పుడే పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టిన బాబు!

CM Chandrababu: అప్పుడే పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టిన బాబు!

CM Chandrababu: పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన కోరుకున్న కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. సచివాలయంలో సైతం ప్రత్యేక ఛాంబర్ ను ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయం తో పాటు అధికారిక నివాసాన్ని సైతం విజయవాడలో ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నిర్ణయం పవన్ తో కలిసి తీసుకుంటున్నారు. కానీ రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా.. ఇచ్చిన ప్రకటనల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం విశేషం.

మీడియా మొఘల్ రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన పుట్టిన జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికిగాను ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది.భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. మరో ఇద్దరు కలెక్టర్లు సైతం పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుంది. అయితే పౌర సంబంధాల శాఖ జారీచేసిన యాడ్లలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించడం లేదు. కేవలం సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రమే ఉంచారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేకుంటే తెలియక చేశారా? అన్నది జనసేనలో హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి ఈ సంస్మరణ సభకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం ఉంది. ఆయన సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రామోజీరావు చనిపోయినప్పుడు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు పవన్. రామోజీరావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏపీ ప్రెస్ అకాడమీకి రామోజీ పేరు పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక అధికారిక కార్యక్రమం కావడంతో.. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను కచ్చితంగా వాడాలి. కానీ కేవలం సీఎం చంద్రబాబు ఫోటో మాత్రమే అందులో కనిపిస్తోంది. దీంతో ఇది రకరకాల చర్చకు దారితీస్తోంది. పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకే ఇటువంటి ప్రయత్నం అని జనసైనికులు అనుమానిస్తున్నారు. అయితే పవన్ అనుమతి లేనిదే ఈ విధంగా చేయరన్న టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ప్రత్యర్థి సోషల్ మీడియా విభాగాలు మాత్రం అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version