spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ లడ్డుకు సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం అధికార, విపక్షం మధ్య గట్టి దుమారం రేపుతోంది. శాసనసభలో కేవలం కూటమి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనమండలిలో మాత్రం కూటమి ఎమ్మెల్సీలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఎందుకంటే శాసనమండలిలో కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువ. శాసనమండలిలో గట్టి మంటలే రేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తోంది. అయితే అక్కడ ఒకే ఒక్కడుగా నారా లోకేష్ నిలుస్తుండడం విశేషం.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

* శాసనమండలి వైపు చూడని బాబు
సాధారణంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఉభయసభల్లో పాల్గొనడం ఆనవాయితీ. కానీ ఎందుకో ఈసారి శాసనమండలి వైపు సీఎం చంద్రబాబు చూడడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి శాసనమండలిలో మంత్రి లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అటువైపుగా చూడడం లేదు. ఒకరిద్దరు మంత్రులు కూడా హాజరవుతున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపిస్తున్నారు నారా లోకేష్. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా ఉన్న బొత్సతో ఢీ అంటే ఢీ అంటున్నారు లోకేష్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ను అరెస్టు చేయడాన్ని లోకేష్ సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీల నోటికి తాళం పడేలా గట్టిగానే ఫైర్ అయ్యారు నారా లోకేష్. శాసనమండలిని లోకేష్ కు విడిచిపెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది.

* ప్రూవ్ చేసుకున్న లోకేష్..
ఈనెల 7 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరగనున్నాయి. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో సుదీర్ఘంగా సాగాయి. అయితే శాసనమండలిలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమకున్న సంఖ్యా బలం ఒక వైపు.. శాసనమండలి చైర్మన్ మరోవైపు.. బొత్స సీనియారిటీ మరోవైపు.. ఇలా ముప్పేట కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చని అంచనా వేసింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ లోకేష్ ధీటుగానే ఎదుర్కొన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేశారు. శాసనమండలిపై లోకేష్ కు సమగ్ర అవగాహన ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. అయితే చంద్రబాబుతో పాటు పవన్ మాత్రం.. శాసనమండలి విషయంలో లోకేష్ కు విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper