Actor Hema: హైదరాబాద్ లో జరిగిన రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల్లో సినీతారలు ఉన్నట్లు వార్తలు రావడంతో కొందరి పేర్లు రావడంపై రాద్ధాంతం నెలకొంది. ఈ కేసులో పట్టుబడిన వారిని విచారించి బయటకు పంపించారు. మిగతా వారిని వెనక్కి పంపినట్లు వార్తలు వచ్చాయి. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, సిప్లిగంజ్ తోపాటు నటి హేమ ఉన్నట్లు ప్రచారం సాగింది. దీనిపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖులు కావడంతో డ్రగ్స్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నటి హేమ తన పేరును వాడుకుందని హేమ ఫైర్ అవుతున్నారు. సదరు మీడియా సంస్థపై కేసు వేస్తానని చెబుతున్నారు. న్యూస్ ఛానల్ ఉద్దేశపూర్వకంగా తమ పేరు వాడుకుందని సూచిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగింది. ఛానల్ లో చేస్తున్న అసత్య ప్రచారానికి కనీసం ఆరా తీయకుండా ఇలా ఎందుకు చేస్తారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో హేమ మీడియాతో మాట్లాడుతూ తనను అవమానపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు తీసుకొచ్చి అవాస్తవాలు ప్రచారం చేయడంపై దుమ్మెత్తిపోశారు. దీంతో తనకు న్యాయం చేయాలని సూచించారు. తనపేరుకు లేని ఆపాదు కల్పించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హేమ పేరు విషయంలో న్యూస్ ఛానల్ ఏదీ పాటించకుండా పేరు వాడటంతో ఆమె ప్రతిష్ట తగ్గిందని వాదిస్తోంది. ఛానల్ తీరుపై విమర్శలు గుప్పించింది. తన పేరు వాడుకుని తనకు అగౌరవం తీసుకొచ్చిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెబుతోంది. డ్రగ్స్ కేసుల్లో ఇలా చేయడం సరైంది కాదని సూచిస్తోంది. ఛానల్ యాజమాన్యం ఇంత అధ్వానంగా ప్రవర్తించడంపై నిప్పులు చెరుగుతోంది.
Also Read:Niharika Konidela: నిహారిక అర్ధరాత్రి నుంచి అక్కడే ఉందట
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More