Liquor Deaths In West Godavari
Liquor Deaths In West Godavari: ఆంధ్రాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలీనాలీ చేసుకునే పేదలు కల్తీ సారాకు బలైపోయారు. వినడానికే బాధగా ఉన్న ఈ ఘటన విషయంలో సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం.. ఇది సహజ మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్లు చేయని ప్రయత్నం లేదు.
Liquor Deaths In West Godavari
జరిగిందేదో ఏదో జరిగింది. వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించడాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Chinajiyar Swamy : కేసీఆర్ తో చెడింది.. చినజీయర్ స్వామిపై వివాదాల బండ పడింది.. వీడియోతో బుక్!
కల్తీసారా లాంటి ఘటనలు తరచుగా ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. బీహార్ సహా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే మధ్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ సర్కార్ ధరలు పెంచడంతో కల్తీ మద్యం తయారై చీప్ గా దొరికిందని తాగి ప్రజలు ఉసురు తీసుకుంటున్నారు.
ఏపీలో మద్యపాన నిషేధం కాదు.. ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. ధరలు భారీగా పెంచి ఏవేవో నకిలీ బ్రాండ్లు తేవడంతో సామాన్యులు ఈ మద్యం కొనలేకపోతున్నారు. తాగడం కోసం వారు నకిలీ మద్యం తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
తప్పుడు మద్యపాన విధానమే ఏపీలో మరణాలకు కారణం. మద్యపాన నిషేధం ఎక్కడా సక్సెస్ కాలేదు. భారత్ లో ఇది అసలు సాధ్యం కాదు. వైసీపీ తప్పుడు మద్యం విధానంతో పేదలు బలి అవుతున్నారని దీనిపై సవివరణ విశ్లేషణను ‘రామ్ ’ గారి కింది వీడియోలో చూడొచ్చు..