Homeఅంతర్జాతీయంPM Modi Swadeshi Movement: నరేంద్రమోదీ.. దేశానికి ఓ సంచలన పిలుపు

PM Modi Swadeshi Movement: నరేంద్రమోదీ.. దేశానికి ఓ సంచలన పిలుపు

PM Modi Swadeshi Movement: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ఎదుగుదలను ఓర్వలేకపోతున్నాడు. అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో ప్రపంచ దేశాల సంపద అంతా అమెరికాకే కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలక్ష భారత్‌పై ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతున్నాయి. ఈనెల 27 నుంచి మరో 25 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే విషయంలో తన నిబద్ధతను మరోసారి వ్యక్తం చేశారు. యువతను, వ్యాపారులను స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, విక్రయించాలని పిలుపునిచ్చారు.

Read Also: కాంగ్రెస్ తో జగన్ రాజీ?

మోదీ ప్రభుత్వం ప్రారంభం నుంచి ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ’ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాల ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఇçప్పుడు మన వస్తువులను మనమే కొనుగోలు చేయాలని యువతకు పిలుపునివ్వడం ద్వారా, దేశీయ ఉత్పాదకులకు, చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు మద్దతు లభిస్తుందని మోదీ భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా దేశంలోని స్థానిక ఉత్పత్తుల డిమాండ్‌ పెరిగి, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాక, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వల్ల వాణిజ్య లోటు నియంత్రణలోకి వస్తుంది. స్వదేశీ ఉద్యమం కేవలం ఆర్థిక విషయం కాదు.. ఇది దేశభక్తి, స్వాభిమానానికి సంబంధించిన భావన కూడా. యువతలో ఈ భావనను నింపడం ద్వారా, దేశీయ ఉత్పత్తుల పట్ల గర్వం, విశ్వాసం పెరుగుతాయని మోదీ ఆశిస్తున్నారు.

దేశభక్తి కొత్తరూపంలో…
మోదీ ‘స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం’ అనే బోర్డులు పెట్టాలన్న సూచన వ్యాపారులకు ఒక సవాల్‌ను అందిస్తుంది. ఈ సూచన ద్వారా వ్యాపారులు తమ దేశభక్తిని చాటుకోవడమే కాకుండా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్‌ను సృష్టించే బాధ్యతను కూడా తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇది వినియోగదారులలో స్వదేశీ ఉత్పత్తులపై అవగాహనను పెంచడానికి ఒక ఆకర్షణీయమైన మార్గం. అయితే, ఈ విధానం అమలు చేయడంలో సవాళ్లు లేకపోలేదు. విదేశీ ఉత్పత్తులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, లగ్జరీ వస్తువుల విషయంలో, ధర, నాణ్యతలో స్థానిక ఉత్పత్తులతో పోటీపడతాయి. అందువల్ల, వ్యాపారులు స్వదేశీ వస్తువులను మాత్రమే విక్రయించాలని నిర్ణయించుకుంటే, వారి వ్యాపార లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సవాల్‌ను అధిగమించడానికి, ప్రభుత్వం స్థానిక ఉత్పాదకులకు సబ్సిడీలు, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్‌ సహాయం అందించాల్సి ఉంటుంది.

Read Also: కూతురిపై కన్ను.. వ్యాపారమే దన్ను..ట్రంప్ పక్కా కమర్షియల్!

స్వదేశీ ఉద్యమంలో కీలక శక్తి..
మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునివ్వడం వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. భారతదేశంలో యువత జనాభాలో గణనీయమైన భాగం, వారి కొనుగోలు నిర్ణయాలు మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యువత స్వదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటే, దేశీయ తయారీదారులకు డిమాండ్‌ పెరుగుతుంది, ఇది ఉద్యోగ అవకాశాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అయితే, యువతను ఈ దిశలో ప్రేరేపించడానికి, స్వదేశీ ఉత్పత్తుల నాణ్యత, ధర, ఆకర్షణ విషయంలో విదేశీ ఉత్పత్తులతో సమానంగా ఉండాలి.

స్వదేశీ ఉద్యమం విజయవంతం కావడానికి అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంది. మొదట, దేశీయ ఉత్పత్తుల నాణ్యత, ధరలు విదేశీ ఉత్పత్తులతో పోటీపడగలిగేలా ఉండాలి. రెండోది స్థానిక తయారీదారులకు తగినంత మౌలిక సదుపాయాలు, సాంకేతిక మద్దతు, ఆర్థిక సహాయం అందుబాటులో ఉండాలి. మూడోది వినియోగదారులలో స్వదేశీ ఉత్పత్తులపై వగాహన, ఆసక్తిని పెంచడానికి ప్రభావవంతమైన మార్కెటింగ్‌ వ్యూహాలు అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version