Homeఅంతర్జాతీయంOil crisis impact on India: చమురు సంక్షోభం.. భారత్‌ అధిగమించే మార్గాలివే!

Oil crisis impact on India: చమురు సంక్షోభం.. భారత్‌ అధిగమించే మార్గాలివే!

Oil crisis impact on India: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే గల్ఫ్‌లోని అమెరికా అనుకూల దేశాలు అల్లాడుతున్నాయి. మరోవైపు ఇరాన్‌ ఆర్మూజ్‌ జల సంధిని మూసివేసింది. ఖమేనీ మరణం తర్వాత హర్మూజ్‌ జలసంధి సంక్షోభం భారత ఇంధన భద్రతను ప్రధానంగా ప్రభావితం చేస్తోంది. ఒమన్‌ దగ్గర ట్యాంకర్‌ దాడి ఆయిల్‌ ధరల పెరుగుదలకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌ ధరల ప్రభావం పడనుంది.

భారత చమురు వినియోగం..
భారత్‌ రోజుకు 5.5 MMbbl చమురు దిగుమతి చేస్తుంది. 85–88% దిగుమతి హర్మూజ్‌ గుండా 35–50% క్రూడ్, 42% కతార్, 80% పైగా గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. సౌదీ(20%), ఇఖ్వైట్‌(10%), ఇరాక్‌ (15%) ప్రధాన మూలాలు. రష్యా 35% (ఉత్తర మార్గాలు). ఐఆర్‌జీసీ అర్మూజ్‌ మార్గం మూసివేయంతో ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 90 నుంచి 100 డాలర్లకు చేరింది.

దేశంలో నిల్వ సమార్థ్యం..
Indian Strategic Petroleum Reserves Ltd (ISPRL) 3 లొకేషన్లలో 5.33 MMఖీ విశాఖ (1.33 MMT, 133 లక్షల బారెళ్లు), మంగళూరు (1.5 MMT), పడూరు (2.5 MMT).భూగర్భ రాక్‌ కేవర్స్‌లో 9–10 రోజుల అవసరాలకు నిల్వలు ఉన్నాయి. అత్యవసరాల్లో మార్కెట్‌ రిఫైనరీలు (15–20 రోజులు), మార్కెటింగ్‌ కంపెనీలు (20–30 రోజులు), ట్యాంకర్లు (10–15 రోజులు)తో మొత్తం 64–74 రోజులకు సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయి.

Also Read: యుద్ధం వెనక అమెరికా బిగ్ స్ట్రాటజీ.. భారత్ మేల్కోవాల్సిందే! లేదంటే మునగడమే!

సామర్థ్యం పెంపునకు..
భవిష్యత్‌లో ఆయిల్‌ సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం 2025 ఫిబ్రవరి బడ్జెట్‌లో రూ.11,000 కోట్ల కేటాయించింది. వీటితో 647 మిలియన్‌ USD), చండీఖోల్‌ (ఒడిశా, 4 MMT), పడూరు–2 (2.5 MMT) ్క్క్క మోడల్‌ (DBFOT). మొత్తం 12 MMT(11.5 రోజులు) నిల్వలకు ప్రయత్నాలు చేస్తోంది. ల్యాండ్‌ అక్విజిషన్‌ పడూరు పూర్తి, చండీఖోల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

అమెరికాతో పోలిస్తే..
US SPR 714 MMbbl(714 మిలియన్‌ బారెళ్లు, 113 MMT) సామర్థ్యం. ప్రస్తుతం 58% (415 MMbbl).ట్రంప్‌ రీఫిల్‌ ప్లాన్‌తో 1.5 బిలియన్‌ డాలర్ల బడ్జెట్, కానీ పూర్తి రీఫిల్‌కు 20 బిలియన్‌ డాలర్లు అవసరం. భారత నిల్వ సామర్థ్యం అమెరికాతో పోలిస్తే 5 శాతం తక్కువ. ్ఞఅయితే అమెరికాలో ఉత్పత్తి ఎక్కువ. వినియోగం తక్కువ. మన వద్ద ఉత్పత్తి దాదాపు లేనట్లే. ఇక వినియోగంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది.

రష్యా నుంచి 35 శాతం ఇంధనం ప్రస్తుతం దిగుమతి అవుతోంది. 80 శాతం ఎల్పీజీ గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుంది. మోదీ నేతృత్వంలో సీసీఎస్‌ మీటింగ్, యూఏఈతో సంప్రదింపులు, డె–ఎస్కలేషన్, బయోఫ్యూల్స్, ఈవీల ప్రోత్సాహం ధరలను స్థిరీకరిస్తాయి. దీర్ఘకాలంలో హైడ్రోజన్, రెన్యూబుల్స్‌ పెంపు అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular