spot_img
Homeఅంతర్జాతీయంNepal Protests: పార్లమెంటుకు నిప్పు.. ప్రధాని పారిపోయాడు.. మంత్రులను ఉరికిచ్చి కొట్టారు..

Nepal Protests: పార్లమెంటుకు నిప్పు.. ప్రధాని పారిపోయాడు.. మంత్రులను ఉరికిచ్చి కొట్టారు..

Nepal Protests: మామూలు ఆగ్రహం కాదది. మామూలు ఆవేశం కాదది. అవినీతి తొలగిపోవాలి. బంధుప్రీతి నశించిపోవాలి. మెరుగైన పరిపాలన కావాలి. స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి. అందుకోసమే మా పోరాటం. దానికోసమే మా ఆరాటం. మా గొంతులు నొక్కుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిపాలన మాకొద్దు. ఇటువంటి వ్యక్తులు మాకొద్దు. ఇటువంటి వ్యక్తులు లేని ప్రాంతమే మాకు ముద్దు. స్వచ్ఛమైన నేపాల్ మాకు కావాలి. దానికోసం ఎక్కడి దాకైనా వెళ్తాం. ఎంత దాకా అయినా వెళ్తాం. చివరికి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. నేపాల్ బాగుండాలి. మా మాతృగడ్డ గొప్పగా అభివృద్ధి చెందాలి. అదే మా తాపత్రయం. అదే మా ఆశయం.. ఇదిగో గత రెండు రోజులుగా నేపాల్ దేశంలో అక్కడి యువతరం ఇలాగే మాట్లాడుతోంది. ఇదే స్థాయిలో ఉద్యమాలు చేస్తోంది. చివరికి తాము అనుకున్నది సాధించింది…

నేపాల్ దేశంలో రాజుకున్న చిచ్చు ఈరోజు ఏకంగా పార్లమెంట్ భవనానికి వ్యాపించింది. అక్కడి నిరసనకారులు పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. అంతేకాదు ప్రధానమంత్రిని దేశం విడిచి వెళ్లిపోయేలా చేశారు. మంత్రులను నడివీధిలో ఉరికిచ్చుకుంటూ కొట్టారు. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పాడేల్ ను నడివీధిలో పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రాణ భయంతో ఆయన పారిపోతుండగా మరీ చితకబాదారు. ఆందోళనకారుల పోరాటం వల్ల ఆ దేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు మొత్తం నేపాల్ దాటి వదిలి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది..

ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో దానిని అధ్యక్షుడు ఆమోదించారు. దీంతో నేపాల్ మొత్తం సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయింది. సైన్యం ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపలా కాస్తోంది. మరోవైపు నిషేధ ప్రాంతాలను సైతం ఆందోళనకారులు చుట్టుముట్టారు. పెను విధ్వంసం సృష్టించారు. తమకు స్వచ్ఛమైన పరిపాలన కావాలని డిమాండ్ చేశారు. నేపాల్ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. అక్కడ సామాజిక మాధ్యమాల మీద నిషేధం విధించినప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఆ దేశ పరిపాలకుల మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అక్కడ ఉదృతంగా జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. త్వరలోనే అక్కడ ప్రశాంత పరిస్థితి ఏర్పడాలని కోరుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper