Homeఅంతర్జాతీయంIndians Global Companies: గ్లోబల్‌ కంపెనీలను నడిపిస్తున్న భారతీయులు..

Indians Global Companies: గ్లోబల్‌ కంపెనీలను నడిపిస్తున్న భారతీయులు..

Indians Global Companies: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో భారత సంతతి సీఈవోలు నాయకత్వం వహిస్తూ భారతీయ ప్రతిభను చాటిచెబుతున్నారు. టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, ఫ్యాషన్, ఫైనాన్స్‌ వంటి విభిన్న రంగాల్లో వారు తమ నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సుందర్‌ పిచాయ్‌..
సుందర్‌ పిచాయ్, గూగల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌. సీఈవోగా 2015 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. చెన్నైలో జన్మించిన పిచాయ్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీ.టెక్‌ (మెటలర్జీ), స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్, వార్టన్‌ స్కూల్‌లో ఎమ్మెబీఏ పూర్తిచేశారు. 2004లో గూగల్‌లో చేరిన ఆయన, గూగల్‌ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగల్‌ డ్రైవ్‌ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పిచాయ్‌ నాయకత్వంలో ఆల్ఫాబెట్‌ ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో అగ్రగామిగా నిలిచింది, 2025 ఫిబ్రవరి నాటికి సుమారు ు2.27 ట్రిలియన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను సాధించింది.

Also Read: అటు ఆర్చర్.. ఇటు బుమ్రా.. లార్డ్స్ లో రాణించే జట్టు ఏదో?

సత్య నాదెళ్ల..
హైదరాబాద్‌లో 1967లో జన్మించిన సత్య నాదెళ్ల, 2014 నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా, 2021 నుంచి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీ.ఈ, విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్, చికాగో బూత్‌లో ఎమ్మెబీఏ చేశారు. నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐలో ప్రపంచ నాయకుడిగా మారింది, లింక్డ్‌ఇన్, న్యూయాన్స్‌ కమ్యూనికేషన్స్‌ వంటి బిలియన్‌ డాలర్ల సముపార్జనలను విజయవంతంగా నడిపించారు. 2024 జులై నాటికి మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ 3.25 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

అరవింద్‌ కృష్ణ..
అరవింద్‌ కృష్ణ 2020 నుంచి ఐబీఎం సీఈవోగా, 2021 నుంచి చైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో జన్మించిన ఆయన, ఐఐటీ కాన్పూర్‌లో బీ.టెక్, ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పొందారు. 30 ఏళ్లకు పైగా ఐబీఎంలో సేవలందించిన కృష్ణ, 34 బిలియన్ల డాలర్ల రెడ్‌ హ్యాట్‌ సముపార్జనను నడిపించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్‌ రంగాల్లో ఐబీఎంను అగ్రస్థానంలో నిలిపారు. 2025 ఫిబ్రవరి నాటికి ఐబీఎం మార్కెట్‌ క్యాప్‌ ు244 బిలియన్‌గా ఉంది.

షాంతను నారాయణ్‌…
హైదరాబాద్‌లో జన్మించిన షాంతను నారాయణ్, 2007 నుంచి అడోబ్‌ సీఈవోగా, ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీ.ఈ, బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్, బర్కిలీలో ఎమ్మెబీఏ పూర్తిచేశారు. 1998లో అడోబ్‌లో చేరిన ఆయన, క్లౌడ్‌ ఆధారిత సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను ప్రవేశపెట్టి అడోబ్‌ను సృజనాత్మక సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్రగామిగా నిలిపారు. అడోబ్‌ 2023లో ు19.4 బిలియన్‌ ఆదాయాన్ని సాధించింది.

Also Read: పెట్రోల్ టెన్షన్ లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. రూ.50వేలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్

లీనా నాయర్‌..
లీనా నాయర్‌ 2022 నుంచి లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ షానెల్‌ గ్లోబల్‌ సీఈఓగా ఉన్నారు. కొల్హాపూర్‌లో జన్మించిన ఆమె, వాల్చంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బీ.ఈ., ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్‌పూర్‌లో ఎమ్మెబీఏ చేశారు. యూనిలీవర్‌లో 30 ఏళ్లు పనిచేసి, మొదటి మహిళా, యువ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. నాయర్‌ నాయకత్వంలో షానెల్‌ 2023లో 19.7 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించింది, లగ్జరీ రంగంలో ఆమె ప్రభావం గణనీయంగా ఉంది.

వసంత్‌ నరసింహన్‌..
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో తమిళనాడు సంతతి తల్లిదండ్రులకు జన్మించిన వసంత్‌ నరసింహన్, 2018 నుంచి నోవార్టిస్‌ సీఈఓగా ఉన్నారు. చికాగో యూనివర్సిటీలో బీ.ఎస్‌., హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఎమ్‌.డీ., జాన్‌ ఎఫ్‌. కెనడీ స్కూల్‌లో ఎమ్‌.పీ.పీ. పొందారు. 2005లో నోవార్టిస్‌లో చేరిన ఆయన, సైఆర్‌ఎన్‌ఏ, రేడియోలిగాండ్, జీన్‌ థెరపీలలో కంపెనీని ముందుంచారు. నోవార్టిస్‌ 2023లో ు45 బిలియన్‌ ఆదాయాన్ని సాధించింది.

సంజయ్‌ మెహ్రోత్రా…
కాన్పూర్‌లో జన్మించిన సంజయ్‌ మెహ్రోత్రా, 2017 నుంచి మైక్రాన్‌ టెక్నాలజీ సీఈఓగా ఉన్నారు. బిట్స్‌ పిలానీలో బీ.ఎస్‌., బర్కిలీలో ఎమ్మెస్‌ పొందారు. 1988లో సాన్‌డిస్క్‌ సహ–స్థాపకుడిగా, 2011–2016 మధ్య సీఈఓగా పనిచేశారు. మైక్రాన్‌లో ఆయన నాయకత్వంలో మెమరీ, స్టోరేజ్‌ సొల్యూషన్స్‌లో కంపెనీ గ్లోబల్‌ లీడర్‌గా నిలిచింది. 2024 జులై నాటికి ఆయన నికర విలువ ు140 మిలియన్‌గా అంచనా వేయబడింది.

జయశ్రీ ఉల్లాల్‌…
లండన్‌లో జన్మించి, ఢిల్లీలో పెరిగిన జయశ్రీ ఉల్లాల్, 2008 నుంచి అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈఓగా ఉన్నారు. శాంటా క్లారా యూనివర్సిటీలో బీ.ఎస్‌., శాన్‌ ఫ్రాన్సిస్కో స్టేట్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ చేశారు. క్లౌడ్‌ నెట్‌వర్కింగ్‌ రంగంలో అరిస్టాను అగ్రస్థానంలో నిలిపిన ఆమె, ఫోర్బ్స్‌ జాబితాలో ప్రముఖ నెట్‌వర్కింగ్‌ నాయకురాలిగా గుర్తింపు పొందారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular