Homeఅంతర్జాతీయంChina Mosquito Drones: చైనా మస్కిటో డ్రోన్స్‌.. శత్రుదేశాలే లక్ష్యంగా తయారీ..!

China Mosquito Drones: చైనా మస్కిటో డ్రోన్స్‌.. శత్రుదేశాలే లక్ష్యంగా తయారీ..!

China Mosquito Drones: మనకు ఇంట్లో దోమలు కుడితే వెంటనే చంపేస్తాం. చేతితో కొడితే రక్తం మన చేతికి కూడా అంటుతుంది. ఇక మస్కిటో బ్యాట్‌తో కొడితే.. మాడిపోయిన వాసన వస్తుంది. కానీ, ఎప్పుడైనా దోమలను చంపినప్పుడు కర్తానికి బదులు ఆయిల్‌ లాంటి పదార్థం అంటినా ఆందోళన చెందకండి. ఎందుకంటే అవి చైనా తయారు చేసిన మస్కిటో ఆర్మీ పోర్స్‌ దోమలు కావొచ్చు. శత్రుదేశాలే లక్ష్యంగా ఈ ఆయుధాలను తయాలు చేస్తోంది.

Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!

నీలి ఆకాశంలో అదృశ్య గూఢచారులు
చైనాలోని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ (ఎన్‌యూడీటీ) అభివృద్ధి చేసిన మస్కిటో డ్రోన్స్‌ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక విప్లవాత్మక ముందడుగును సూచిస్తున్నాయి. కేవలం 0.3 గ్రాముల బరువు, రెక్కలు, సన్నని కాళ్లతో దోమ ఆకారంలో రూపొందిన ఈ డ్రోన్స్, గూఢచార విధానాలను, యుద్ధ వ్యూహాలను మార్చివేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ చిన్న యంత్రాలు సైనిక, గూఢచార విధుల కోసం రూపొందించబడినవి, ఇవి సంప్రదాయ రాడార్‌లకు కనిపించకుండా రహస్య సమాచారాన్ని సేకరించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

అత్యంత చిన్న పరిమాణంలో..
ఈ మస్కిటో డ్రోన్స్‌ కేవలం 1.3 సెంటీమీటర్ల పొడవు, 0.3 గ్రాముల బరువుతో, మదర్‌బోర్డ్, కమ్యూనికేషన్‌ సర్క్యూట్, బ్యాటరీ, అతి చిన్న కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ డ్రోన్స్‌ రెక్కలు దోమల రెక్కల వలె కదులుతాయి, మూడు సన్నని కాళ్లు ల్యాండింగ్‌ లేదా పెర్చింగ్‌ కోసం ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీటిని నియంత్రిచవచ్చు. రహస్య సైనిక కార్యకలాపాలకు అనువైనవిగా రూపొందించబడ్డాయి. అయితే, బ్యాటరీ జీవితకాలం, పేలోడ్‌ పరిమితులు వంటి సాంకేతిక సవాళ్లు పూర్తిగా పరిష్కరించబడలేదు.

గూఢచర్య సామర్థ్యం..
ఈ డ్రోన్స్‌ ప్రధాన బలం వాటి అదృశ్య స్వభావం. రాడార్‌లకు కనిపించని ఈ డ్రోన్స్, శత్రు ప్రాంతాల్లో రహస్యంగా చొచ్చుకొని సమాచారాన్ని సేకరించగలవు. ఇవి భవనాల లోపల, గదులలో, లేదా సున్నితమైన ప్రాంతాల్లో గుర్తించబడకుండా వీడియో, ఆడియో, లేదా ఎలక్ట్రానిక్‌ సిగ్నల్స్‌ను సేకరించగలవు. ఇటువంటి సామర్థ్యం దేశాల భద్రతా వ్యవస్థలకు, గోప్యతా చట్టాలకు కొత్త సవాళ్లను తెస్తుంది. ఈ డ్రోన్స్‌ రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సమావేశాలు, లేదా సైనిక స్థావరాలపై గూఢచర్యం చేయడానికి ఉపయోగపడవచ్చు, ఇది గోప్యతా ఆందోళనలను రేకెత్తిస్తోంది.

పాయిజన్‌ దాడుల భయం
ఈ డ్రోన్స్‌ గూఢచర్యంతోపాటు, ఆయుధీకరణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. నిపుణులు ఈ డ్రోన్స్‌కు సూక్ష్మ సిరంజిలను అమర్చి, విష దాడులు లేదా జీవ ఆయుధాలను ఉపయోగించే అవకాశం గురించి హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సామర్థ్యం యుద్ధ వ్యూహాలను మార్చివేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ డ్రోన్స్‌ శత్రు దళాలను గుర్తించకుండానే నాశనం చేయగలవు.

భద్రతా ఆందోళనలు
ఈ డ్రోన్స్‌ సామర్థ్యం గోప్యతా, భద్రతా సమస్యలను లేవనెత్తుతోంది. ఈ డ్రోన్స్‌ రహస్య సమాచారాన్ని సేకరించడం ద్వారా దేశాల జాతీయ భద్రతను, వ్యక్తిగత గోప్యతను హాని చేయవచ్చు. అంతేకాక, వీటిని దుర్వినియోగం చేసే అవకాశం, పౌరులపై గూఢచర్యం లేదా టార్గెటెడ్‌ దాడులకు ఉపయోగించే అవకాశం, అంతర్జాతీయ చట్టాలు, నీతి నియమావళిని ప్రశ్నార్థకం చేస్తుంది.

Dahagam Srinivas
Dahagam Srinivashttps://oktelugu.com/
Dahagam Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Politics, Sports, Cinema, General, Business. He covers all kind of All kind of news content in our website.
RELATED ARTICLES

Most Popular