Ayatollah Ali Khamenei finished: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలను ఖమేనీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. మరోవైపు అణ్వస్త్రాల తయారీపై అమెరికా ఇరాన్పై కన్నెర్రజేసింది. ఇలాంటి పరిస్థితిలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్పై సంచలన దాడి వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
ఎంఈకే ప్రకటన వివరాలు
ప్రతిపక్ష సాయుధ సంస్థ పీపుల్స్ ముజాహిదీన్ ఆఫ్ ఇరాన్(ఎంఈకే) సోమవారం ఖమేనీ నివాసం మొతాహరి కాంప్లెక్స్పై 100 మంది ఫైటర్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో ప్రభుత్వ బలగాలకు భారీ నష్టం, తమ వైపు కూడా కొంత ప్రాణాలు పోగొట్టుకున్నాటి చెప్పారు. ఈ దాడిలో ఖమేనీ మృతిచెందినట్లు ప్రకటించారు.
వీడియోలు వైరల్..
కాంప్లెక్స్ చుట్టూ అంబులెన్సులు పెద్ద సంఖ్యలో కనిపించాయి, భద్రతా బలగాలు గట్టిగా మార్చాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు, వ్యతిరేక సందేశాలు కనిపించాయని కూడా ప్రచారం.
అధికారిక స్పందన లేక..
ఇరాన్ అధికారిక మీడియా లేదా అంతర్జాతీయ సంస్థలు ఇప్పటివరకు «ధ్రువీకరణ చేయలేదు. ఖమేనీ ఆరోగ్యం లేదా మరణం గురించి ఆధారాలు లేకపోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఎంఈకే నేపథ్యం
1965లో స్థాపితమైన ఎంఈకే 1979 విప్లవంలో పాల్గొన్నా, తర్వాత ప్రవాసంలో పోరాడుతూ గతంలో కూడా సంచలన ప్రకటనలు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పెంటగాన్ ఖమేనీ, కుమారుడు మోజ్తబాపై లక్ష్యపెట్టిన హత్యాప్లాన్లు సమర్పించినట్లు వార్తలు వెలుగుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతాయేమోనని ఆందోళనలు నెలకొంటున్నాయి.