Meenakshi Chaudhary praises TTD services: గత కొంతకాలం నుండి మన ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు అపవిత్రం అయ్యిందని , కల్తీ నెయ్యి ని ఉపయోగించారని ఆధారాలతో సహా అడ్డం గా దొరికిపోయిన వైసీపీ ప్రభుత్వం , మొదట్లో ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ వాదించే ప్రయత్నం చేసింది . కానీ జనాలు నమ్మకపోవడం తో తిరుమల లడ్డు తయారీకి ‘భోలే బాబా డైరీ’ కి అప్పట్లో నెయ్యి సరఫరా చేసిందని , ‘భోలే బాబా డైరీ’ తో చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కూడా చేతులు కలిపి కల్తీ నెయ్యి ని సరఫరా చేశారని మరో అబద్దపు ప్రచారాన్ని తీసుకొచ్చి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ , శాసన మండలి లో కూడా వాడివేడి చర్చలు నడుస్తున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో ప్రముఖ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) TTD సేవలపై ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది . ఆమె మాట్లాడుతూ ‘తిరుమలకు నేను తరచూ వస్తుంటాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నా మనసు ఎంతో ఆనందానికి , ప్రశాంతతకు గురైంది. ఇక్కడ పీల్చే గాలిలో కూడా గోవిందా నామాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంతే కాకుండా టీటీడీ అధికారుల మ్యానేజ్మెంట్ కూడా చాలా గొప్పగా ఉంది. అన్నప్రసాదాలు దగ్గర నుండి , శ్రీవారి దర్శనం కల్పించడం వరకు అన్నిరకాల సేవలు అద్భుతంగా ఉన్నాయి ‘ అంటూ తన అనుభూతిని ఒక వీడియో ద్వారా పంచుకుంది. దీనిని చూసిన నెటిజెన్స్ నిజంగానే ఇప్పుడు టీటీడీ మ్యానేజ్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. అన్న ప్రసాదం తిరుమల లడ్డు లో క్వాలిటీ ఇప్పుడు బాగా పెరిగింది. చాలా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు .
అయితే వైసీపీ పార్టీ అభిమానులు మాత్రం మీనాక్షి చౌదరి వీడియో పై విమర్శలు గుప్పిస్తోంది . ఆమె చేత ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో ని చేయించారని , తిరుమల లడ్డు వ్యవహారం లో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసి జనాల్లో నెగటివిటీ ని సంపాదించుకోవడం వల్ల , డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇలా మీనాక్షి చౌదరి తో వీడియో చేయించారని అంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీటీడీ అధికారుల పనితీరు ని మెచ్చుకుంటూ ఒక వీడియో చేసాడు . ఈ వీడియో ని కూటమి పార్టీ అభిమానులు షేర్ చేస్తూ , ఇదిగో మీ వైసీపీ హార్డ్ కోర్ నాయకుడు కూడా టీటీడీ అధికారులను మెచ్చుకుంటున్నాడు. ఆయన చేత కూడా కూటమి ప్రభుత్వమే చెప్పించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూటమి ఫ్యాన్స్.