Extramarital affairs: ఏమున్నావే తల్లీ.. ఒడిలో తల పెట్టమని చెప్పి భర్తను ప్రియుడితో కాటికి పంపించింది..

Extramarital affairs: వివాహేతర సంబంధాలు.. వైవాహిక బంధాలకు గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు.. కట్టుకున్నవారికి మరణ శాసనాలవుతున్నాయి. ఇతరుల మోజులో పడి బంధాలు తెచ్చుకునేలా చేస్తున్నాయి. కట్టుకున్నవారినే కాల యముడిలా మార్చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా.. కొన్ని ఘటనలు చూసినప్పుడు గుండెలో కలుక్కుమంటుంది. ఇలాంటి ఓ ఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. తన ఒడిలో తలపెట్టుకొమ్మని భార్య గోముగా అడిగితే ఎంత ప్రేమో… అనుకున్నాడా భర్త. వెనుక నుంచి ఆమె ప్రియుడు తనను హతమార్చుతాడని […]

Written By: Neelambaram, Updated On : August 23, 2023 5:04 pm
Follow us on

Extramarital affairs: వివాహేతర సంబంధాలు.. వైవాహిక బంధాలకు గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు.. కట్టుకున్నవారికి మరణ శాసనాలవుతున్నాయి. ఇతరుల మోజులో పడి బంధాలు తెచ్చుకునేలా చేస్తున్నాయి. కట్టుకున్నవారినే కాల యముడిలా మార్చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా.. కొన్ని ఘటనలు చూసినప్పుడు గుండెలో కలుక్కుమంటుంది. ఇలాంటి ఓ ఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. తన ఒడిలో తలపెట్టుకొమ్మని భార్య గోముగా అడిగితే ఎంత ప్రేమో… అనుకున్నాడా భర్త. వెనుక నుంచి ఆమె ప్రియుడు తనను హతమార్చుతాడని ఊహించలేకపోయాడు.

ఒడిలో తల పెట్టుకుని..
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు(33), జానకి (24) భార్యాభర్తలు. పాతకృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రి చింతల రాము(34)తో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన భర్త.. జానకిని పని మాన్పించాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిపి ఆమె పన్నాగం పన్నింది. భర్తకు మాయమాటలు చెప్పి ఈ నెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకువెళ్లింది.

బహిర్భూమికి వెళ్లాలని..
తిరుగుప్రయాణంలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలంటూ బైకు ఆపించి రోడ్డుపక్కన జీడితోటలోకి తీసుకువెళ్లింది. కాసేపు కూర్చుందామని చెప్పి భర్త తలను ఒడిలో పెట్టుకుంది. అప్పటికే అక్కడ మాటువేసిన రాము.. తనవెంట తెచ్చుకున్న సుత్తితో తలవెనుక బలంగా కొట్టాడు. దీంతో అప్పలనాయుడు అక్కడికక్కడే కూలిపోయాడు. తర్వాత ఇద్దరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డుకు చేర్చారు. రాము అక్కడ నుంచి జారుకోగా జానకి అక్కడే ఉండి రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ వచ్చి, పోయేవారిని నమ్మించే ప్రయత్నం చేసింది.

ప్రమాదకర దృశ్యం లేకపోవడంతో..
రోడ్డుపై యాక్సిటెండ్‌ ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు. బండి పడిపోయి ఉంది. దీంతో స్థానికులు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కూడా రోడ్డు ప్రమాదంపై అనుమానం కలిగింది. దీంతో భార్య జానకిని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విసయం బయటపడింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.