Homeట్రెండింగ్ న్యూస్Chhattisgarh Atrocity: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌ రేప్‌ లో ఏఎస్ఐ కొడుకు.. స్వయంగా అరెస్ట్ చేసి ఆ...

Chhattisgarh Atrocity: అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌ రేప్‌ లో ఏఎస్ఐ కొడుకు.. స్వయంగా అరెస్ట్ చేసి ఆ పోలీస్ అధికారి ఏం చేశాడంటే?

Chhattisgarh Atrocity: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాఖీ వేడుకలకు వెళ్లిన అక్క, చెల్లిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. రాయ్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి(19), ఆమెకు కాబోయే భర్త, చెల్లి(16)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా కొందరు అడ్డుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.

రాఖీ వేడుకలకు వెళ్లి వస్తుండగా..
రాయ్‌ పూర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి(19)కి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆమె తన చెల్లి(16), కాబోయే భర్తతో కలిసి రాఖీ వేడుకల కోసం గురువారం మహాసముంద్‌ జిల్లాకు బైక్‌పై బయల్దేరారు. వేడుకల అనంతరం ముగ్గురూ రాత్రి తిరిగి వస్తుండగా, రాయ్‌ పూర్‌ దగ్గర కొంతమంది అడ్డుకున్నారు. మొదట ముగ్గురు వచ్చి వాళ్ల దగ్గరున్న డబ్బులు, ఫోన్లు దోచుకుని వెళ్లిపోయారు. అదే టైమ్‌లో మరో ఏడుగురు అక్కడికి వచ్చారు. యువతికి కాబోయే భర్తను తీవ్రంగా కొట్టారు. అక్కాచెల్లెళ్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేసి వెళ్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు..
తర్వాత కాసేపటికి తేరుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కంప్లయింట్‌ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, పది మందిని అరెస్టు చేశారు.

నిందితుల కోసం ఎస్‌ఎస్‌పీ నేతృత్వంతో బృందాలు..
అత్యాచార నిందితులు, అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ఎస్‌ఎస్‌పీ బృందాలను నియమించారు. ఈ బృందాలు పలుచోట్ల గాలించి మరుసటి రోజు ఉదయం వారందరినీ అరెస్టు చేశాయి. ఏఎస్సై సాహుకు విచారణ అప్పగించారు. అయితే గ్యాంగ్ రేప్ చేసిన వారిలో తన కుమారుడు ఉండడంతో ఏఎస్ఐ సాహూ షాక్‌ అయ్యాడు, కుమారుడిని రాగద్వేషాలకు తావివ్వకుండా అరెస్టు చేసిన ఏఎస్ఐ సాహూ వెంటనే విచారణ నుండి తప్పుకొని శభాష్ అనిపించుకున్నాడు.

-ప్రముఖుల పిల్లలు..
నిందితుల్లో లోకల్‌ బీజేపీ లీడర్‌ లక్ష్మీనారాయణ సింగ్‌ కొడుకు పూనమ్‌ ఠాకూర్‌ ఉన్నారని పోలీసులు చెప్పారు. అతడు ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చాడని పేర్కొన్నారు. మరొకరు కేసును విచారిస్తున్న పోలీసు స్టేషన్‌లో నియమించబడిన పోలీసు అధికారి కుమారుడు కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. రేప్ కేసు నిందితుడి తండ్రి, ఏఎస్‌ఐ దీపక్‌ సాహు ఎలాంటి ఫైరవీలకు తావివ్వకుండా తన కొడుకు కృష్ణను అరెస్టు చేయడంపై ఎస్పీ అభినందించాడు. మరోవైపు ఏఎస్‌ఐ కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాయ్‌పూర్‌ సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ కు విజ్ఞప్తి చేయగా.. ఆయన మన్నించి, విచారణకు ఆటంకం కలగకుండా ఏఎస్‌ఐ సాహును మరో పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన వారిలో ఒకరు మైనర్‌ ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version