మరో బాంబ్ పేల్చిన వర్మ.. ఈసారి ఏం చేస్తాడో?

వివాదాస్పద దర్శకుడు వర్మ చాలా సినిమాలు మొదలుపెట్టాడు. అవి అతీగతీ లేకుండా పోయాయి. ఇప్పుడు తమిళనాట హీట్ పాలిటిక్స్ లో శశకళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటివరకు చాలా ప్రకటించి రిలీజ్ చేయని వర్మ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ చేసేలానే ఉన్నాడు. దీనికి సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్ రెడ్డినే మరోసారి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం విశేషం. మరి ఈ ‘శశికళ’ బయోపిక్ ఎన్ని వివాదాలు చుట్టుముట్టుకుంటుందో.. విడుదల అవుతుందో లేదో […]

Written By: NARESH, Updated On : November 22, 2020 10:20 am
Follow us on

వివాదాస్పద దర్శకుడు వర్మ చాలా సినిమాలు మొదలుపెట్టాడు. అవి అతీగతీ లేకుండా పోయాయి. ఇప్పుడు తమిళనాట హీట్ పాలిటిక్స్ లో శశకళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటివరకు చాలా ప్రకటించి రిలీజ్ చేయని వర్మ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ చేసేలానే ఉన్నాడు. దీనికి సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్ రెడ్డినే మరోసారి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం విశేషం. మరి ఈ ‘శశికళ’ బయోపిక్ ఎన్ని వివాదాలు చుట్టుముట్టుకుంటుందో.. విడుదల అవుతుందో లేదో చూడాలి.

Also Read: బికినీలో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న రకుల్

తెలుగులో ఇప్పటికే వర్మ తీసిన బయోపిక్ లు లెక్కలేదు. బాలీవుడ్ లోనూ పలువురి బయోపిక్ లను చెక్కాడు. రాజకీయంగా సమాజంలో సంచలనమైన ప్రతి విషయాన్ని సినిమాగా తీసి ‘క్యాష్’ చేసుకునే వర్మ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల వేళ కూడా అక్కడి ప్రజల ఆసక్తిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారన్న టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.తాజాగా తమిళనాడు పాలిటిక్స్ లో జయలలిత తర్వాత అంతటి బలీయమైన శక్తి అయిన ‘శశికళ’పై రాంగోపాల్ వర్మ బయోపిక్ ప్రకటించాడు. ‘లవ్ ఈజ్ డేంజరస్ లీ పొలిటికల్’ అన్న క్యాప్షన్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం. ఈ జనవరిలోనే జైలు నుంచి విడుదల కాబోతున్న శశికళ తమిళ పాలిటిక్స్ ను శాసించనుంది. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద సబ్జెక్ట్ ను వర్మ టేకప్ చేయడం విశేషం.

రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ‘తమిళనాడు నేతల మధ్య ఉన్న బంధాన్ని వారి రాజకీయ తెరంగేట్రాన్ని చూపించబోతున్నా.. తమిళనాడు ఎన్నికల కన్నా ముందు జయలలిత బయోపిక్ రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుదల చేస్తాం’ అని ఓ ఫొటోను విడుదల చేశారు.

Also Read: ఎట్టకేలకు మహేష్ మూవీ స్టాట్.. సెంటిమెంట్ రిపీట్..!

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో దేశమంతా చూపు అటువైపు పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈరోజు తమిళనాడులో పర్యటించి రాజకీయ లాబీయింగ్ చేశారు. అయితే రాజకీయాలు, సినిమాల్లో ప్రతి అవకాశాన్ని ‘క్యాష్’ చేసుకునే వర్మ ఈ తమిళ రాజకీయాలను వదలుతాడా? వదలడు కదా.. అందుకే తాజాగా తమిళులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్