Homeట్రెండింగ్ న్యూస్ఏడేళ్ల క్రితం జైలు నుంచి పారిపోయిన వ్యక్తి.. చివరకు..?

ఏడేళ్ల క్రితం జైలు నుంచి పారిపోయిన వ్యక్తి.. చివరకు..?

ఒక వ్యక్తి ఏడేళ్ల క్రితం ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి దోషిగా తేలింది. కోర్టు జైలు శిక్ష విధించడంతో జైలులో ఉన్న ఆ వ్యక్తి సోదరి పెళ్లి కోసం బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చాక అతని బుద్ధి మారిందో లేక ఎవరైనా సలహా ఇచ్చారో తెలీదు కానీ ఆ వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు దోషి కోసం ఎంతగానో వెతికారు. అయితే ఎంత కష్టపడినా అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

దీంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి పోలీసులు వెతకడం మానేశారు. అలా పారిపోయిన ఆ వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని అక్కడే జీవనం సాగించాడు. అయితే ఎట్టకేలకు ఒక చిన్న పని కోసం సొంతూరికి వచ్చి ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సార దుర్యోధనరావు అనే వ్యక్తి 2007లో పార్వతి అనే మహిళను దారుణంగా హత్య చేశాడు.

2013 సంవత్సరం ఆగష్టు నెల 3వ తేదీన కోర్టు దుర్యోధనరావుకు జీవిత ఖైదు విధించింది. చెల్లి పెళ్లి కోసం ఎస్కార్ట్ సహాయంతో వెళ్లిన అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లిన దుర్యోధనరావు ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా బల్లిగుడలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించాడు. తన సోదరుడి ఇళ్ల స్థలం వివాదంలో చిక్కుకోవడంతో కాశీబుగ్గకు వచ్చి వెళుతూ ఉండేవాడు.

పోలీసులకు దుర్యోధనరావు ఊళ్లోకి వచ్చినట్టు సమాచారం అందడంతో అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు రేపు పలాస కోర్టులో హాజరు పరచనున్నారు. పారిపోయిన జీవితఖైదీని పట్టుకున్న పోలీసులపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version