spot_img
Homeట్రెండింగ్ న్యూస్Odisha Husband And Wife: భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండా అమ్మి మరో పెళ్లి చేసుకున్న...

Odisha Husband And Wife: భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండా అమ్మి మరో పెళ్లి చేసుకున్న భర్త

Odisha Husband And Wife: భార్యను సహ ధర్మచారిణి అంటారు.అంటే తన జీవితంలో సగమని భావించాలంటారు. తనను నమ్ముకొని వచ్చిన ఆలిని అన్నివేళలా అండగా నిలవాలంటారు. కానీ కొందరు మాత్రం కర్కశంగా వ్యవహరిస్తారు. అమానుషంగా ప్రవర్తిస్తారు. అనుమానంతో కడతెరుస్తుంటారు. పరస్త్రీ వ్యామోహంలో పడి భార్య పట్ల నిర్లక్ష్యం చూపుతారు. మరకొందరైతే వ్యసనాలకు బానిసగా మారి కట్టుకున్న భార్యనే నరకం చూపిస్తారు. అయితే ఒడిశాలో ఇటువంటి అమానవీయ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యసనాలకు బానిసైన వ్యక్తికి బయట ఎక్కడా అప్పుపుట్టలేదు. దీంతో సరికొత్తగా ఆలోచించిన వ్యక్తి భార్యను అడ్డం పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుతో వేరే రాష్ట్రానికి చెక్కేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అయితే ఎనిమిదేళ్ల తరువాత కానీ భర్త తనకు చేసిన అన్యాయాన్ని బాధిత మహిళ గుర్తించలేకపోయింది.

Odisha Husband And Wife
Odisha Husband And Wife

వైద్యం చేయిస్తానని చెప్పి…
ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా కొటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ, రంజిత దంపతులు నివసిస్తుండే వారు. వీరికి ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రశాంత్ కందూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుడు. రంజితను ఇష్టపడి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2018లో రంజిత అస్వస్థతకు గురైంది. కిడ్నీలో రాళ్లు ఉంటాయని చెప్పి ప్రశాంత్ రంజీతాను భువనేశ్వర్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించాడు. దీంతో తన భర్త తనపై చూపిస్తున్న కేర్ ను చూసి రంజిత మురిసిపోయింది. కానీ భర్త తనకు తెలియకుండా తన కిడ్నీని తీసి డాక్టరు సహాయంతో విక్రయించడాని తెలుసుకోలేకపోయింది. ఆ సమయంలో అనస్తీషియా రూపంలో ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి తతంగాన్ని జరిపించడంతో ఆమె గుర్తించలేకపోయింది. అయితే ఇటీవల ఆమె కడుపునొప్పితో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరింది. డాక్టరు పరీక్ష చేసి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఒక కిడ్నీతో ఉన్నారని చెప్పడంతో రంజితాకు మైండ్ బ్లాక్ అయ్యింది. అటు భర్త ప్రవర్తనలో అనుమానం రావడంతో ఆరా తీయడం ప్రారంభించింది., భర్తే కిడ్నీ విక్రయించాడని తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.

Odisha Husband And Wife
Odisha Husband And Wife

పోలీసులకు ఫిర్యాదు..
అయితే భర్త ప్రస్తుతం తన వద్ద లేడు. ఎనిమిది నెలల కిందట మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె తో కలిసి బెంగళూరులో కాపురం పెట్టాడు. అటు శరీరంలో అవయం పోయి..ఇటు భర్త జాడ లేకపోడంతో రంజిత జీవితం కకావికలమైంది. వృద్ధులైన తల్లిదండ్రులే ఆసరా అయ్యారు. తన జీవితం నాశనం చేసిన భర్త ప్రశాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రంజిత డిమాండ్ చేస్తోంది. మల్కాన్ గిరి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రశాంత్ కోసం బెంగళూరుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని పంపించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper