Veerasimha reddy : మైత్రి మూవీ మేకర్స్ ని బెదిరించిన నందమూరి బాలకృష్ణ.. అందుకే పోస్టర్ వదిలారా..

Nandamuri Balakrishna Veerasimha reddy : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది.. మొదటి రోజు వచ్చిన బంపర్ ఓపెనింగ్ కి ఆ తర్వాత రోజు నుండి వస్తున్న వసూళ్లకు అసలు పొంతనే లేదు.. యావరేజి వసూళ్లనే సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం.. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేద్దామని అనుకున్నారు.. […]

Written By: NARESH, Updated On : January 16, 2023 8:34 pm
Follow us on

Nandamuri Balakrishna Veerasimha reddy : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతోంది.. మొదటి రోజు వచ్చిన బంపర్ ఓపెనింగ్ కి ఆ తర్వాత రోజు నుండి వస్తున్న వసూళ్లకు అసలు పొంతనే లేదు.. యావరేజి వసూళ్లనే సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం.. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేద్దామని అనుకున్నారు.. కానీ కుదర్లేదు.

బాలయ్య బాబు సంక్రాంతికే కావాలని మొండిపట్టు పట్టడం, అప్పటికే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ ని విడుదల చేస్తున్నాం అని అభిమానులకు ఒక ప్రకటన ఇచ్చేసారు.. ఇప్పుడు మళ్ళీ అదే ప్రొడక్షన్ నుండి ‘వీర సింహా రెడ్డి’ ని వదిలితే రిస్క్ ఏమో అనే ఆలోచన కూడా లేకుండా బాలయ్య ఒత్తిడిని భరించలేక జనవరి 12వ తారీఖున ‘వీర సింహారెడ్డి’ ని మరియు 13 వ తేదీన ‘వాల్తేరు వీరయ్య’ ని విడుదల చేసేసారు ఈ మూవీ నిర్మాతలు.

తెలుగు సినిమా చరిత్ర లోనే ఒకే బ్యానర్ నుండి ఒక్క రోజు తేడాతో సినిమాలు విడుదల అవ్వడం ఇదే తొలిసారి..’వాల్తేరు వీరయ్య’ కి ఎక్కువ వసూళ్లు వచ్చాయి..’వీర సింహా రెడ్డి’ చిత్రం కనీసం దరిదాపుల్లో కూడా లేదు..’వాల్తేరు వీరయ్య’ చిత్రానికి మూడు రోజుల్లో 108 కోట్ల రూపాయిలు వచ్చినట్టు పోస్టర్ ని విడుదల చేసారు.

ఆ వెంటనే ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి నాలుగు రోజుల్లో 104 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు మరో పోస్టర్ ని విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్.. అయితే వీర సింహా రెడ్డి చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..కానీ బాలయ్య బాబు ఇచ్చిన వార్నింగ్ కి భయపడి 104 కోట్ల రూపాయిల గ్రాస్ పోస్టర్ ని విడుదల చేసినట్టు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ల్స్ వేస్తున్నారు..దీనికి నిర్మాతలు స్పందిస్తారో లేదో చూడాలి.