‘Gajjala Gurram’ movie in Sudheer Sudhir-Rashmi combination : హీరోగా సుధీర్ ఫస్ట్ హిట్ కొట్టాడు. గాలోడు మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుంది. వీకెండ్ ముగిసే నాటికి గాలోడు రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. ఈ చిత్రం రూ. 2 నుండి 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో గాలోడు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల దిశగా పరుగులు తీస్తుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ చేస్తానని తెలియజేశారు.
నిజానికి సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాల్లో హీరోయిన్ గా రష్మీని అనుకున్నారట. డేట్స్ కుదరకపోవడంతో రష్మీ ఆ రెండు చిత్రాల్లో చేయలేకపోయారని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. అయితే వీరిద్దరి కోసం నా దగ్గర మరో కథ ఉంది. గజ్జల గుర్రం టైటిల్ తో ఒక కథ సిద్ధంగా ఉంది. దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ గా మలిచి సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కిస్తానని రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుందని ఆయన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
తన వద్ద ఉన్న కథలు సుధీర్ కి చక్కగా సరిపోతాయన్న రాజశేఖర్ రెడ్డి, మా ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ కుదిరింది. సుధీర్ మనకంటే అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్-రష్మీ కాంబినేషన్ లో మూవీ చేస్తే చూడాలని వారి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలలో కలిసి మూవీ ఎప్పుడు చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు గజ్జల గుర్రం మూవీతో ఫ్యాన్స్ కోరిక తీరనుంది. గజ్జల గుర్రం హీరోయిన్ ప్రధానంగా సాగే కథ అని తెలుస్తుంది.
గాలోడు విజయంతో సుధీర్ ఇమేజ్ మరో లెవల్ కి చేరింది. నెక్స్ట్ ఆయన ‘కాలింగ్ సహస్ర’ చిత్రంతో అలరించనున్నారు. హారర్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపై సుధీర్ కి హీరోగా ఆఫర్స్ పెరిగే సూచనలు కలవు. సినిమా అవకాశాలు వస్తున్నా బుల్లితెర షోస్ వదలనని సుధీర్ చెప్పడం విశేషం. తనకు కెరీర్ ఇచ్చిన టెలివిజన్ లో కొనసాగుతా అని ఇటీవల వెల్లడించారు. సుధీర్ యాంకర్ గా ”కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్” పేరుతో ఆహాలో ఓ కామెడీ షో ప్రారంభం కానుంది. డిసెంబర్ 2 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది.