Allu Aravind On Balagam: బలగం మూవీని మెచ్చుకోలేకపోతున్న అల్లు అరవింద్… దానికి బలమైన కారణమే ఉంది!

Allu Aravind On Balagam: సాధారణంగా చిన్న సినిమాలు విజయం సాధిస్తే నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభిమానిస్తారు. ఆ సినిమాతో ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా… పరిశ్రమకు చెందిన మూవీగా భావించి ప్రోత్సాహం ఇస్తారు. గతంలో పలు చిన్న హీరోలు, సినిమాల సక్సెస్ ని ఆయన అభినందించారు. అయితే బలగం విషయంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు.బలగం అంత పెద్ద విజయం సాధించినా ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఒక్క కామెంట్ చేయలేదు. కమెడియన్ […]

Written By: Shiva, Updated On : April 11, 2023 8:28 am
Follow us on

Allu Aravind On Balagam

Allu Aravind On Balagam: సాధారణంగా చిన్న సినిమాలు విజయం సాధిస్తే నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా అభిమానిస్తారు. ఆ సినిమాతో ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా… పరిశ్రమకు చెందిన మూవీగా భావించి ప్రోత్సాహం ఇస్తారు. గతంలో పలు చిన్న హీరోలు, సినిమాల సక్సెస్ ని ఆయన అభినందించారు. అయితే బలగం విషయంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు.బలగం అంత పెద్ద విజయం సాధించినా ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఒక్క కామెంట్ చేయలేదు. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం అద్భుతాలు చేస్తుంది.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. గత యాభై రోజులుగా బలగం గురించి చర్చ నడుస్తూనే ఉంది. గ్రామాల్లో బహిరంగ ప్రదర్శలు వేసుకుని మరీ జనాలు చూస్తున్నారు. తొమ్మిది అంతర్జాతీయ అవార్డ్స్ బలగం మూవీ సొంతం చేసుకుంది. ఇంతటి అరుదైన చిత్రాన్ని అల్లు అరవింద్ పట్టించుకోకపోవడం చర్చకు దారితీసింది. అయితే దానికి బలమైన కారణమే ఉందని టాలీవుడ్ వర్గాల వాదన.

దిల్ రాజుతో ఏర్పడిన విభేదాల కారణంగానే అల్లు అరవింద్ బలగం టీమ్ ని అభినందించలేకపోతున్నారట. గతంలో దిల్ రాజు, అల్లు అరవింద్ మంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కంట్రోల్ చేస్తున్న ఆ నలుగురిలో ఈ ఇద్దరు ప్రముఖులు. ఆ విధంగా దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య సాన్నిహిత్యం ఉండేది. ఇటీవల దిల్ రాజు చర్యతో అది చెడింది. తాను అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న కాంబోలో దిల్ రాజు మూవీ ప్రకటించడం వివాదానికి దారితీసింది.

Allu Aravind On Balagam

పరుశురాం దర్శకుడిగా విజయ్ దేవరకొండలతో మూవీ చేయాలని అల్లు అరవింద్ భావించాడు. తనకు ఓ మూవీ చేసి పెట్టమని పరుశురాం కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న పరుశురాం దిల్ రాజుతో మూవీకి కమిట్ అయ్యాడు. దిల్ రాజును ఏమీ అనలేని అల్లు అరవింద్ దర్శకుడు పరశురామ్ పై ఫైర్ అయ్యాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ దిల్ రాజులను ఏకిపారేయాలని డిసైడ్ అయ్యాడు. పరుశురాం ఆయన ఇంటికెళ్లి ప్రసన్నం చేసుకోవడంతో అప్పటికి శాంతించాడు. ఈ వివాదం నేపథ్యంలో దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ గురించి అల్లు అరవింద్ మాట్లాడలేదంటున్నారు.