Homeఆంధ్రప్రదేశ్‌Jagan Delhi Tour: అప్పుల కోసం తప్పదు.. ఏపీ కోసం.. అయినను వెళ్లి రావలె హస్తినకు

Jagan Delhi Tour: అప్పుల కోసం తప్పదు.. ఏపీ కోసం.. అయినను వెళ్లి రావలె హస్తినకు

Jagan Delhi Tour
Jagan Delhi Tour

Jagan Delhi Tour: వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల అప్పుల కోసం కేంద్రం వైపు చూస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు. నవరత్నాలపైనే దృష్టంతా పెట్టి అభివృద్ధిని గాలికొదిలేశాని అపవాదు ఉంది. గత ఏడాది భారీగా నిధులను కేంద్రం జమ చేసింది. అవి కాక మరలా అప్పుల కోసం కేంద్రాన్ని బతిమిలాడుకుంటోంది. ఆ బాధ్యతను ఈ సారి సీఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలోనే దాదాపుగా మకాం పెట్టారు. కేంద్ర మంత్రులు, అధికారులను అపాయిట్ మెంట్ల కోసం ఎదురుచూసేవారు. పిలుపు రాగానే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి లడ్డూలను, విగ్రహాలను, చిత్రపటాలను చేతబట్టకొని ఉండేవారు. వాటన్నింటిని టీటీడీ అధికారులు ఆగమేఘాల మీద రెడీ చేసి పంపేవారు. వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి అప్పులను అడిగేవారని చెబుతున్నారు. దాంతో మొహం వాచి పోయిన వారందరూ నో అపాయింట్ మెంట్ బోర్డు పెట్టేశారు.

దాంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రలకు సిద్ధపడ్డారు. అప్పులు అవసరమైన ప్రతీసారి ఆయనే వెళ్లివచ్చేవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక తప్పక అపాయింట్ మెంట్ ఇస్తే ఈయనది కూడా అప్పుల అభ్యర్థనలే అవడంతో, తలనొప్పిగా మారిందని విసుగును బయటకు కనబడకుండా ఇబ్బందులు పడేవారని అంటున్నారు. కానీ, ఇప్పుడు వస్తామంటున్నా, కేంద్రం పెద్దలు వద్దంటున్నారు. ఆ విధంగా కేంద్ర వద్ద రాష్ట్ర పరువు మొత్తం తీసేసిన తరువాత ఇప్పుడు అప్పులు తెచ్చే బాధ్యతను సీఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు. ఆయన కేంద్రం వద్ద పడిగాపులు కాచి, తమకు ఇస్తామన్న నిధులు ఎప్పుడిచ్చినా ఫర్వాలేదు.. అప్పులకు మాత్రం అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే, అటు నుంచి స్పందన మాత్రం రాకపోతుండటంతో నిష్టూరుస్తున్నారు.

Jagan Delhi Tour
Jagan Delhi Tour

వాస్తవానికి ఏపీ ప్రభుత్వం లెక్కలేనన్ని అప్పులు చేసింది. ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పులే కాకుండా కార్పొరేషన్ సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు. ఆ లెక్కలు బయటకు చెప్పడం లేదు. వాటిని ఇవ్వాలని కేంద్రం అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కొత్త అప్పులను నిలిపివేసింది. అప్పుల లెక్కలు చెప్పిన తరువాతే ఇవ్వాలా వద్దా? అన్నది తేలుస్తామంటున్నది. ఒకవేళ అప్పులెన్ని తెచ్చారో చెబితే కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా పుట్టదు.

మరోవైపు సంక్షేమ పథకాలకు విడుదల చేస్తామన్న సమయం దాటిపోతోంది. పరిపాలన అవసరమైన నిధులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సరిపడా నిధులు వస్తేనే సంక్షేమ పథకాలకు బటన్ నొక్కే పరిస్థితి ఉంది. బహిరంగ సభలు పెట్టిన బటన్ నొక్కుతున్నా, అర్హులైన చాలా మంది లబ్ధిదారులకు నిధులు జమ కావడం లేదు. వారు సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి వారి సంఖ్య జిల్లాల్లో చాలానే ఉంది. అభివృద్ధి పనులు చేపట్టిన వారికి నిధులు విడుదల కాక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version