spot_img
Homeట్రెండింగ్ న్యూస్Tirupati: మరో దాడి.. అరాచకం రాజ్యమేలుతుంటే ఏపీలో బతికేదెట్లా?

Tirupati: మరో దాడి.. అరాచకం రాజ్యమేలుతుంటే ఏపీలో బతికేదెట్లా?

Tirupati: ఏపీకి ఏమైంది? కొత్తగా కొన్ని రకాల అరాచక శక్తులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది? రహదారులపైనే దాడులకు దిగుతుండడం.. హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్ను చితక బాదడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. విశాఖలో అయితే ఏకంగా ఓ ఆర్మీ సైనికుడు పైనే పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని తెలియజెప్పింది. ఇప్పుడు తాజాగా తిరుపతిలో ఏకంగా ఓ బస్సు డ్రైవర్ను అర్ధరాత్రి కిందకు దించి దారుణంగా కొట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

మొన్న ఆ మధ్యన కావలిలో ఓ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా ఓ ద్విచక్ర వాహనం ఉండడంతో హారన్ కొట్టారు. దీంతో సదరు ద్విచక్ర వాహనదారుడు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ కొద్దిసేపటికే కారులో 14 మంది వెంబడించి.. బస్సు డ్రైవర్ పై అమానుషంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సుధీర్ నేరచరిత్ర తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.

అయితే ఆ ఘటన మరువక ముందే తిరుపతిలో సైతం అటువంటి దుశ్చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ బస్సు డ్రైవర్ పై దాడి జరిగింది. రోడ్డుపై ఆరుగురు యువకులు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో సదరు యువకులు ఆగ్రహానికి గురయ్యారు. మా వేడుకలకు ఇబ్బంది పెడతావా అంటూ డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బస్సు నుంచి కిందకు దించి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో ఆ ఆరుగురు యువకులు పారిపోయారు. ఈ ఘటనను చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. విపరీతంగా వైరల్ అయింది.

అయితే ఈ ఘటనలకు గంజాయి, మద్యం మత్తు కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా చలామణి అవుతుండడం తోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాసిరకం మద్యంతో యువకులు పక్కదారి పడుతున్నారని.. ఏం చేస్తున్నామో తెలియక విచక్షణ కోల్పోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper