Amit Shah Meeting Trisha Delhi: తమిళనాడులో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేశారు నేపథ్యంలో.. అక్కడ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నాయి. మొన్నటిదాకా అక్కడ ప్రధాన పోటీ డీఎంకే, అన్నా డీఎంకే మధ్య సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే విజయ్ టీవీ కె పార్టీని పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
ఇటీవల విజయ్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త వేరే మహిళతో ఉంటున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోని త్రిష, విజయ్ కి సంబంధం ఉందని ఆరోపణలు రావడం మొదలైంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఏకంగా విజయ్, త్రిష మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత త్రిష ఘాటుగా స్పందించడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత త్రిష, విజయ్ జంటగా ఒక పెళ్ళికి హాజరయ్యారు. తద్వారా తమ మధ్య ఉన్న బంధాన్ని పరోక్షంగా బయటపెట్టారు. అయితే త్రిష ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. టి వి కే రాజకీయాలు మొత్తం విజయ్ చుట్టు కాకుండా, త్రిష చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ టీవీ కే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకొనే నిర్ణయం ఆమె చేతిలో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఆమె అమిత్ షా తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికలు త్వరలో జరుగుతున్న వేళ ఈ పరిణామం సంచలనానికి కారణమైంది. దీనికి తోడు ఏఐడీఎంకె నేతలు కూడా త్రిషతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే టీవీకే, బిజెపి, అన్నా డీఎంకే పార్టీలు కలిసి.. కూటమిగా ఏర్పడి డిఎంకెను ఢీకొడతాయని తెలుస్తోంది.
ఇటీవల త్రిషకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని.. హీరోయిన్ అయ్యానని.. ఇక తన తదుపరి లక్ష్యం అదేనని త్రిష వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజయ్ తో త్రిష సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఆమె తమిళనాడు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రిషతో తనకున్న సంబంధాన్ని ఇంతవరకు విజయ్ కొట్టి పారేయలేదు. అటు త్రిష కూడా తీసిపారేయలేదు. త్రిష తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పిన నేపథ్యంలో.. ఎంజీఆర్ కాలంలో జయలలిత మాదిరిగా తమిళనాడు రాజకీయాలలో త్రిష ఇప్పుడు చక్రం తిప్పుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
