spot_img
Homeక్రీడలుక్రికెట్‌India vs England Test Series : జట్టులోకి బుమ్రా ఎంట్రీ.. అతడికి రెస్ట్.. మూడో...

India vs England Test Series : జట్టులోకి బుమ్రా ఎంట్రీ.. అతడికి రెస్ట్.. మూడో టెస్ట్ ముందు ఇదేం ట్విస్ట్

India vs England Test Series : రెండవ టెస్టు మ్యాచ్లో గెలిచిన నేపథ్యంలో టీమిండియా ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మొదలుకానుంది. ఈ టెస్ట్ గెలిచి సిరీస్ లో ముందడుగు వేయాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. మూడో టెస్టు కు జట్టులోకి బుమ్రా వస్తాడని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గిల్ ప్రకటించాడు. మొదటి టెస్ట్ లో బుమ్రా నిర్విరామంగా బౌలింగ్ వేశాడు. దీంతో అతనికి రెండవ టెస్టులో విశ్రాంతి ఇచ్చారు. రెండో టెస్టులో మహమ్మద్ సిరాజ్ అవిశ్రాంతంగా బౌలింగ్ వేశాడు. ఆకాష్ కూడా అదే స్థాయిలో బౌలింగ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్.. రెండవ ఇన్నింగ్స్ లో ఆకాష్ అదరగొట్టారు. ఇంగ్లాండ్ జుట్టు టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించారు..

రెండవ టెస్టులో మహమ్మద్ సిరాజ్ దాదాపు 32 ఓవర్లు వేశాడు. అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. నిర్విరామంగా బౌలింగ్ వేయడంతో అతడు అలసిపోయాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.. దీంతో అతనిపై వర్క్ లోడ్ అధికంగా పడకూడదని మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే అతడిని మూడో టెస్టుకు విశ్రాంతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ జట్టులోకి బుమ్రా వస్తున్న నేపథ్యంలో.. సిరాజ్ స్థానంలో బుమ్రా ను తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ప్రసిధ్ కృష్ణను మూడవ టెస్టులో కూడా జట్టులో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మొదటి టెస్టులో ప్రసిధ్ వికెట్లు పడగొట్టినప్పటికీ దారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా పరుగులు ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. పరుగులు వేయకుండా ఇంగ్లాండు బ్యాటర్లను కట్టడి చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో మెరుగ్గా బౌలింగ్ చేసిన నేపథ్యంలో.. లార్డ్స్ టెస్టులో ప్రసిధ్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. స్పిన్ విభాగంలో కులదీప్ యాదవ్ కు చోటు ఇవ్వచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రెండవ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యాడు. బ్యాటింగ్లో తేలిపోయాడు. బౌలింగ్లో చేతులెత్తేశాడు. దీంతో అతడి స్థానంలో కులదీప్ కు చోటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

తొలి టెస్ట్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెండవ టెస్టులో విశ్రాంతి ఇచ్చాడు. ఇక మూడో టెస్టులో సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చి బుమ్రాను జట్టులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ప్రసిధ్ కృష్ణ విషయంలో మేనేజ్మెంట్ ఏమైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే అర్ష్ దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి రెండో టెస్టులోనే అతడు జట్టులోకి ప్రవేశిస్తాడని అనుకున్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల అతడి ఎంట్రీ సాధ్యం కాలేదు. ఒకవేళ మూడో టెస్టులో ప్రసిధ్ కు కనుక రిక్తహస్తం చూపిస్తే ఖచ్చితంగా అర్ష్ దీప్ సింగ్ కు లో చోటు లభిస్తుంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ తొలి టెస్ట్ లో ఏకంగా 41 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. రెండో టెస్టులో 32 ఓవర్ల పాటు బౌలింగ్ వేసాడు. ఈ స్థాయిలో అతడు బౌలింగ్ వేయడంతో తీవ్రంగా అలసిపోయాడు. అందువల్లే అతడికి మూడవ టెస్టులో విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version