Homeజాతీయ వార్తలుPakistan Multinational Companies : పాకిస్తాన్‌ను వీడుతున్న మల్టీనేషనల్‌ కంపెనీలు.. అసలాదేశంలో ఏం జరుగుతోంది!

Pakistan Multinational Companies : పాకిస్తాన్‌ను వీడుతున్న మల్టీనేషనల్‌ కంపెనీలు.. అసలాదేశంలో ఏం జరుగుతోంది!

Pakistan Multinational Companies : మన దాయాది దేశం పాకిస్తాన్‌. రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్య్రవ వచ్చినా.. అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. వనరులు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. అక్కడి రాజకీయ, సైనిక పరిస్థితులు కూడా ఇందుకు కారణం. ఇక ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన ఆటకంగా మారింది. ఈ క్రమంలో తాజాగా అనేక మల్టీ నేషనల్‌ కంపెనీలు ఆ దేశాన్ని వీడుతున్నాయి.

ఇటీవలే ప్రముఖ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌.. కార్యకలాపాలు నిలిపివేసింది. మళ్లీ ప్రారంభిస్తామని పైకి చెబుతున్నా.. పూర్తిగా వైదొలిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఒక్కటే కాదు అనేక విదేశీ కంపెనీలు పాకిస్తాన్‌లో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. ఫైజర్, అమెజాన్, సుజుకీ వంటి పలు మల్టీనేషనల్‌ కంపెనీలు పాకిస్తాన్‌లో తమ కార్యకలాపాలను మూసివేయడం ఆ దేశ ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది.

ప్రధాన కారణాలు..

1. ఆపరేషన్‌ సిందూర్‌..
భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్, 2025లో పాకిస్తాన్‌లో జరిగిన ఒక ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌ కారణంగా భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు మరింత దిగజారాయి, దీనివల్ల వాణిజ్యం, విమాన సేవలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నాయి. ఈ దాడులు విదేశీ కంపెనీలలో అస్థిరత, భయాందోళనలను సృష్టించాయి, ఫలితంగా మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను మూసివేసే నిర్ణయం తీసుకున్నాయి. ఈ సంఘర్షణ కారణంగా విదేశీ పెట్టుబడిదారులు పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం తగ్గింది. ఎందుకంటే యుద్ధం వల్ల వ్యాపార వాతావరణం అనిశ్చితంగా మారింది.

2. విదేశీ పెట్టుబడుల కొరత..
పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. 2024–25లో పాకిస్తాన్‌లో ఎఫ్‌డీఐ గతంలో కంటే చాలా తక్కువగా నమోదైంది. దీనికి కారణం అస్థిరమైన రాజకీయ వాతావరణం, అధిక పన్నులు, దిగుమతులపై ఆంక్షలు. మైక్రోసాఫ్ట్‌ తన కార్యకలాపాలను వియత్నాంకు మార్చడానికి అక్కడి రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంది. అలాగే, ఫైజర్‌ వంటి ఫార్మా కంపెనీలు కూడా స్థానిక మార్కెట్‌లో పోటీ, ధరల నియంత్రణ, ఆర్థిక అస్థిరత కారణంగా తమ కార్యకలాపాలను మూసివేశాయి.

3. పాకిస్తాన్‌ కరెన్సీ విలువ పతనం..
పాకిస్తాన్‌ రూపాయి విలువ 2022–23 మధ్యకాలంలో అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే 62% క్షీణించింది, దీనివల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారాయి. ఫలితంగా, టెక్‌ ఉపకరణాలు, ఫార్మా ముడిసరుకులు, ఇతర అవసరమైన వస్తువుల దిగుమతులు కష్టతరమయ్యాయి. ఈ కరెన్సీ క్షీణత కంపెనీల ఉత్పత్తి ఖర్చులను పెంచింది, ముఖ్యంగా ఫైజర్‌ వంటి ఫార్మా కంపెనీలకు, దీనివల్ల అవి స్థానిక కంపెనీలకు తమ యూనిట్లను విక్రయించాయి. మైక్రోసాఫ్ట్‌ కూడా ఈ ఆర్థిక అస్థిరత కారణంగా పాకిస్తాన్‌ను వదిలివెళ్లింది.

4. ఇంధన ధరల పెరుగుదల..
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం (2022), దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం వల్ల పాకిస్తాన్‌లో ఇంధన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వ్యాపారాల ఆపరేషనల్‌ ఖర్చులను పెంచింది, ముఖ్యంగా సుజుకీ వంటి ఆటోమొబైల్‌ కంపెనీలకు, దీనివల్ల ఉత్పత్తి తగ్గించడం లేదా పూర్తిగా మూసివేయడం జరిగింది. అధిక ఇంధన ధరలు లాజిస్టిక్స్‌ మరియు సరఫరా గొలుసులను కూడా దెబ్బతీశాయి.

5. విద్యుత్‌ కోతలు, ఇంటర్నెట్‌ అస్థిరత..
పాకిస్తాన్‌లో తరచూ జరిగే విద్యుత్‌ కోతలు (లాహోర్, కరాచీలలో రోజుకు 6–8 గంటలు) నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్‌ స్పీడ్‌ (ప్రపంచంలో 126వ స్థానం) వ్యాపారాలకు పెద్ద సవాళ్లుగా మారాయి. ఈ పరిస్థితులు టెక్‌ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి వాటికి కార్యకలాపాలను కొనసాగించడం కష్టతరం చేశాయి. అదనంగా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్‌ వంటి రంగాలలో కూడా విద్యుత్‌ కొరత వల్ల ఉత్పత్తి ఆగిపోయింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version