HomeతెలంగాణSurvey Sensation In Telangana: తెలంగాణలో సర్వే సంచలనం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

Survey Sensation In Telangana: తెలంగాణలో సర్వే సంచలనం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

Survey Sensation In Telangana: తెలంగాణలో తాజా ఓ సర్వే సంచలనం రేపింది. జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్‌వో) ఇచ్చిన నివేదిక ఆందోళన పుట్టించింది. జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఎడ్యుకేషన్, హెల్త్, మొబైల్, ఇంటర్నెట్, అప్పులు తదితర అంశాలపై సర్వే చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను వెల్లడించింది.

తెలంగాణలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అలాగే.. 18 ఏళ్లు నిండిన వారిలో 42.04 శాతం మంది అప్పుల్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశ సగటుతో పోలిస్తే చాలా వరకు ఎక్కువ. మరోవైపు.. ఎవరైనా కుటుంబాల నుంచి ఆస్పత్రిలో చేరితో కుటుంబాలు కుదేలు కావాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలోని కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 15 నుంచి 24 ఏళ్లలోపు యువతలో 99.2 శాతం మంది పురుషులు, 98.3 శాతం మహిళలకు చదవడం, తేలికైన వాక్యాలు రాయడంతోపాటు రోజువారీ లెక్కలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే 97.8శాతం పురుషులు, 95.9శాతం మహిళలకు ఈ సామర్థ్యం ఉంది. తెలంగాణలో ఇలాంటి వారు గ్రామాలకు వచ్చేసరికి 98.1శాతం, పట్టణాల్లో 99.6శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది. ఇక 15 ఏళ్లు పైబడిన వారందరిలో తెలంగాణలో 75.4శాతం మందికి ఈ సామర్థ్యాలు ఉన్నట్లు తెలిపింది. 18 ఏళ్లు పైబడిన 97.5శాతం మందికి వ్యక్తిగత లేదా జాయింట్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. గ్రామాల్లో 98శాతం, పట్టణాల్లో 96.9శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి.

తెలంగాణలో 6-10 ఏళ్లలోపు చిన్నారుల్లో 94శాతం మంది పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారు. అలాగే.. గ్రామాల్లో 94.9శాతం, పట్టణాల్లో 93.4శాతం మంది ప్రాథమిక విద్యలో నమోదు చేసుకున్నారు. పట్టణాలతో పోల్చితే పల్లెల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలోని చిన్నారులందరిలోనూ బాలురు 94.1శాతం, బాలికలు 94.5శాతం పిల్లలు పాఠశాల విద్యలో ఉన్నారు. బాలురతో పోల్చితే బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక 21-35 ఏళ్ల వయస్సు ఉన్న యువతలో 66.3శాతం మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను చదువుతున్నారు. గ్రామాల్లో ఈ కోర్సులు చేసిన వారు 58.2శాతం, పట్టణాల్లో 71.5శాతం ఉన్నారు. గ్రామాల్లో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇక పట్టణాలకు వచ్చేసరికి పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది.

మరోవైపు.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఎక్కువ మంది తమ అత్యవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. వీరిలో చాలా మంది చేబదులు రూపంలో తీసుకోవడం చేస్తున్నారు. తీసుకున్న ఆ నగదును సకాలంలో చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి సరైన ఆర్థిక వనరులు వారికి సమకూరడం లేదు. కాగా.. తెలంగాణలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతీ లక్ష మందికి 42,407 మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామాల్లోనే అప్పులున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ లక్ష మందిలో గ్రామీణ ప్రాంతాల్లో 50,289 మంది, పట్టణాల్లో 31,309 మంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇదే వయసు వారిలో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే గ్రామాల్లో 18,714 మంది, పట్టణాల్లో 17,442 మంది అప్పుల్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు.. ప్రతీ వ్యక్తికి సగటున తీసుకుంటే గ్రామాల్లో వైద్యం ఖర్చు రూ.1,443గా ఉంది. అదే జాతీయ సగటున రూ.1,035 ఉంది. ఇంటర్నెట్ వినియోగం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కిల్స్ 64.8శాతం మందికి మాత్రమే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version