Municipal Elections Results: ఎన్నికల జరుగుతున్నప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు.. ఇతర కానుకలు ఇచ్చి ఓటర్లను తమ వైపు మళ్లించుకుంటారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధన ప్రవాహం బీభత్సంగా ఉంటుంది. ఆ సమయంలో డబ్బు, ఇతర కానుకలు భారీగానే దక్కుతాయి.
స్థానిక ఎన్నికలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తారు. కానుకలు ఇస్తూ ఉంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుంటారు.
కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బుతో పాటు విలువైన వస్తువులు కూడా కానుకలుగా అందిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే గెలవాలని భావిస్తుంటారు. ఇంత స్థాయిలో ఖర్చుపెట్టినప్పటికీ కొన్ని సందర్భాలలో అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉండదు. ఆ సమయంలో గెలిచిన అభ్యర్థి ఆనందంగా ఉంటే.. ఓడిపోయిన అభ్యర్థి విచారంలో ఉంటాడు. కొన్ని సందర్భాలలో ఓడిపోయిన అభ్యర్థులు తమ ఇచ్చిన కానుకలను తిరిగి ఇవ్వాలని ఓటర్లను డిమాండ్ చేస్తారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో అశ్వరావుపేట పురపాలకంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. అయితే తనకు కొంతమంది ఓటు వేయలేదని గుర్తించి.. వారికి ఇచ్చిన కానుకలను, డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కుక్కర్లు, డబ్బులు తీసుకున్న ఓటర్లు తిరిగి ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారని.. ఆయన ఇచ్చిన డబ్బులు.. కుక్కర్లు తిరిగి చేస్తున్నామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుకలను తిరిగి ఇవ్వమని కోరిన నేపథ్యంలో గులాబీ పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. ఓటర్లు కుక్కర్లో ఇస్తుండగా ఆ దృశ్యాలను వీడియో రూపంలో చిత్రీకరించింది. వాటిని కాస్త సోషల్ మీడియాలో పెట్టింది. తద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. అదే గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ సంఘటనలను బయటపెట్టింది.. ఇప్పుడు ఆ బాధ్యతను గులాబీ పార్టీ సోషల్ మీడియా భుజాలకి ఎత్తుకుంది. ఇక్కడ పార్టీలు మాత్రమే మారాయి.. అభ్యర్థులు మాత్రమే మారారు.. జరిగిన ఘటనలు మాత్రం దాదాపుగా ఒకటే.
మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి… pic.twitter.com/2pqtKeRUHV
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026