HomeతెలంగాణTelangana Student dies In US : అమెరికా కాల్పుల్లో తెలంగాణ యువకుడి విషాదంతం.. ఏం...

Telangana Student dies In US : అమెరికా కాల్పుల్లో తెలంగాణ యువకుడి విషాదంతం.. ఏం జరిగిందంటే

Telangana Student dies In US :  అమెరికాల్లో చదివే విద్యార్థుల్లో భారతీయులే నంబర్ వన్‌ అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇటీవలే అగ్రస్థానానికి చేరుకున్నారు. కానీ, అమెరికాలో మరణిస్తున్న విద్యార్థుల్లోనూ భారతీయులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నెలకు కనీసం ముగ్గురు నలుగురు మృత్యువాత పడుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటుండుగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందుతున్నారు. కొందరు అమెరికాలోని దుండగుల దాడుల్లో హతమవుతున్నారు. తాజాగా అమెరికాలో కాల్పుల ఘటనకు తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగోలోని షాపింగ్‌ మాల్‌లోకి చొచబడిన దుండగులు జరిపిన దాడుల్లో అక్కడే పని చేస్తున్న సాయితేజ ప్రాణాలు కోల్పోయాడు.

గన్‌ కల్చర్‌కారణంగానే..
అమెరికాలో విపరీతమైన గన్‌ కల్చర్‌ ఉంది. ఇటీవల భారతీయ విద్యార్థి కూడా అమెరికాలో తుపాకీ కొనుగోలు చేశాడు. పుట్టిన రోజు దానిని శుభ్రం చేస్తుండగా, మిస్‌ఫైర్‌ అయి మృతిచెందాడు. ఇక అమెరికన్లు అయితే చేతిలో తుపాకీ ఉంటే.,. ఇష్టానుసారం కాల్పులు జరుపుతున్నారు. గతంలో జరిపిన కాల్పుల్లో సాధారణ పౌరులతోపాటు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం తూటాలకు బలయ్యారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

చదువుకునేందుకు వెళ్లి..
ఖమ్మం రూరల్‌ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయితేజ(26) అమెరికాలో చదువుకుంటున్నాడు. పై చదువుల కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. చికాగోలోని ఓ సాపింగ్‌ మాల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ.. చదువుకుంటున్నాడు. శనివారం తెల్లవారుజామున కొంతమంది దుండగులు మాల్లోకి దూసుకొచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న సాయితేజపై కాల్పులు జరిపారు. అనంతరం దుకాణంలోని నదగు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో సాయితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం కూడా..
నాలుగు రోజుల క్రితం కూడా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఓ స్టోర్‌లో దోపిడీకి యత్నించిన యువకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మైనాంక్‌ పటేల్‌ ప్రాణాలు కోల్పోయాడు. నార్త్‌ కరోలినాలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో గాయపడిన పటేల్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్టోర్‌లో దోపిడీ కోసమే పటేల్‌పై కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా పటేల్‌ భార్య గర్బిణి. వారికి ఐదేళ్ల కూతురు ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version