HomeతెలంగాణRevanth Reddy: రేవంత్‌కు కేసీఆర్‌ ఆఫర్‌.. సంచలన విషయం బయటపెట్టిన టీపీసీసీ చీఫ్

Revanth Reddy: రేవంత్‌కు కేసీఆర్‌ ఆఫర్‌.. సంచలన విషయం బయటపెట్టిన టీపీసీసీ చీఫ్

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటలో‍్ల వెలవడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అధికారం ఖాయమంటున్నాయి. ఒకటి రెండు సర్వేలు హంగ్‌ వస్తుందని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటున్నాయి. అయితే కాంగ్రెస్‌లో మాత్ర గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. గతంలో వైఎస్సాఆర్, కేసీఆర్ తనక ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించానన్నారు. అధికారం ఆశించి ఉంటే ఇప్పటికే అధికార పార్టీల్లో కీలక పదవుల్లో ఉండే వాడినని తెలిపారు. పదవులు ఆశించలేదు కాబట్టే ప్రతిపక్ష పార్టీకి పీసీసీ చీఫ్‌గా ఉన్నానన్నారు. 20 ఏళ్లుగా అపోజిషన్ పార్టీలో ఉన్నానని దాంతోనే తాను సంతోషంగా ఉన్నానన్నారు.

గుండెల్లో ప్రజలు..
తెలంగాణ అధికారంలోకి రాబోతున్నా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమా, అధికారం ముఖ్యమా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రేవంత్‌ సెంటిమెంట్‌ సమాధానం ఇచ్చారు. తన గుండెల్లో ప్రజలు ఉన్నారన్నారు. తాను ఇండింపెండెంట్‌గా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానన్నారు.

వారికన్నా తన పార్లమెంట్‌ ఓటర్లే ఎక్కువ..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్లు మోడీ, అమిత్ షా ఇద్దరు సెగ్మెంట్లలో ఉన్న ఓటర్ల కన్నా ఎక్కువ అన్నారు. మల్లు భట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్ననని చెప్పారని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పగా.. రేవంత్‌రెడ్డి బదులిస్తూ తమ పార్టీలో గెలవబోయే 80 మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాండిడేట్లే అన్నారు. సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version