Venu Swmy : వేణు స్వామి మెడకు బలంగా బిగుస్తున్న ఉచ్చు..జర్నలిస్ట్ మూర్తి సంచలనం!

వారం రోజుల క్రితమే వేణు స్వామి కి మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది, ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి వేణు స్వామి పై మరో కేసు నమోదు చేసాడు. చూస్తుంటే అందరికీ జాతకాలు చెప్పే వేణు స్వామి తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలని, ప్రస్తుతం ఆయనకీ గడ్డు కాలం నడుస్తుందని, ఇంకా ఆయన ఇలా సోషల్ మీడియా లో స్తంట్స్ వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి రావొచ్చని,

Written By: Vicky, Updated On : August 20, 2024 6:02 pm

venu swmy

Follow us on

Venu Swmy : వివాదాల ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న అతి కొద్దిమందిలో వేణు స్వామి ఒకడు. టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు పెళ్లి చేసుకుంటే చాలు, అశుభం మాట్లాడేందుకు తెల్ల బోర్డు వేసుకొని వచ్చేస్తాడు. ఎంత మంది ఈయనని ఎన్ని విధాలుగా తిట్టినా తన పద్దతి మార్చుకోడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు రాసుకోండి అంటూ చెప్పుకొచ్చిన ఈయన, అది జరగకపోవడంతో ఇక మీదట సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు గురించి జాతకాలు చెప్పను అంటూ ప్రతిజ్ఞ తీసుకున్నాడు. కానీ నాగ చైతన్య , శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే మరోసారి తెల్లబోర్డు వేసుకొచ్చి, వాళ్లిద్దరూ మూడేళ్ళలో విడిపోతారు అంటూ వ్యాఖ్యలు చేసాడు.

దీనిపై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. ఈయనపై మహిళాసంఘాలు మహాల కమీషన్ కి ఫిర్యాదు కూడా చేసాయి. 22 వ తేదీలోపు వివరణ ఇవ్వకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఈ వివాదం నడుస్తుండగా, ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు ఉచ్చు లాగ బిగుచుకుంది. టీవీ 5 లో జర్నలిస్ట్ గా పని చేస్తున్న మూర్తి పై ఆయన తన భార్యతో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మూర్తి తమని 5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడని, తాము అందుకు ఒప్పుకోక పోయేసరికి 8 నెలల నుండి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఆయన పెడుతున్న టార్చర్ కారణంగా మేము ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది అంటూ వీళ్లిద్దరు ఒక వీడియో విడుదల చేసారు. దీనిపై జర్నలిస్ట్ మూర్తి కూడా చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే జనాలు నన్ను రాళ్లతో కొట్టి చంపొచ్చు అంటూ ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా నేడు ఆయన పోలీసులను ఆశ్రయించి, తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు వేణు స్వామి, అతని భార్య శ్రీవాణి పై ఫిర్యాదు నమోదు చేసాడు. ట్విట్టర్ ఈ విషయాన్ని ఆయన షేర్ చేస్తూ వేణు స్వామి చెప్పిన మాటలన్నీ కల్పితమని, నిజానిజాలేంటో త్వరలోనే లీగల్ గా తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

వారం రోజుల క్రితమే వేణు స్వామి కి మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది, ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి వేణు స్వామి పై మరో కేసు నమోదు చేసాడు. చూస్తుంటే అందరికీ జాతకాలు చెప్పే వేణు స్వామి తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలని, ప్రస్తుతం ఆయనకీ గడ్డు కాలం నడుస్తుందని, ఇంకా ఆయన ఇలా సోషల్ మీడియా లో స్తంట్స్ వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి రావొచ్చని, కొన్ని రోజులు సోషల్ మీడియా లో కాపాడొద్దు అంటూ ఆయనకీ నెటిజెన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి వేణు స్వామి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆసక్తి కరంగా మారిన అంశం.