spot_img
HomeతెలంగాణHyderabad polling : హైదరాబాద్ పోలింగ్..! దేశానికే అనేక సవాళ్లు..!

Hyderabad polling : హైదరాబాద్ పోలింగ్..! దేశానికే అనేక సవాళ్లు..!

Hyderabad polling : దేశంలో అత్యంత సమస్యాత్మకమైన లోక్సభ సెగ్మెంట్లలో హైదరాబాద్ ఒకటని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ లిమిట్స్ లో ఎంఐఎం చాలా బలంగా ఉంది. గోషామహల్,కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తప్ప మిగతా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పతంగికి గట్టి పట్టుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ ఓవైసీ ఫ్యామిలీదే గెలుపు. గత 40 ఏళ్లుగా ఓవైసీ ఫ్యామిలీ అప్రతిహతంగా విజయాల పరంపరను కొనసాగిస్తూ..వస్తుంది.

అయితే గతం సంగతి ఎలా ఉన్నా.. ఈసారి మాత్రం హైదరాబాద్ లోక్సభ పోలింగ్..దేశానికి అనేక సవాళ్లను విసిరింది. ఈ సెగ్మెంట్ పరిధిలో ఈసారి ఎంఐఎం బీజేపీ మధ్య నడిచిన హోరా హోరీ పోరు.. ఎన్నికల వ్యవస్థకే అనేక పాటలను నేర్పింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని చాన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఓట్లతోనే పతంగి పార్టీ విజయం సాధిస్తూ.. వస్తుందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్లతోనే అసద్ గెలుస్తున్నారని చాలాసార్లు ఆరోపించారు. తాము ఈ విషయంలో ఎన్నోసార్లు రాష్ట్ర,కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.

ఇక ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ..హైదరాబాద్ పోలింగ్ విధానంలో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. అయితే ఈసారి బిజెపి తరఫున మాధవీలత బరిలో నిలవడం సంచలనం రేపింది. ఈసారి పోలింగ్ సందర్భంగా ఆమె హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనేక బూతులు తిరుగుతూ..ఓటర్ల గుర్తింపును చెక్ చేసింది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల కొందరు ఎంఐఎం పార్టీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రకటించడం సంచలనంగా మారింది. అంతేకాక ఆమె ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన సందర్భంగా ఓ ముస్లిం మహిళ హిజాబ్ తీసి ఓటర్ ఐడెంటిఫికేషన్ చెక్ చేయడంపై పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. హిజాబ్ తొలగించకుండా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లను గుర్తించడం ఎలా అని కొందరు ప్రశ్నిస్తే.. హిజాబ్ ను తీసి ఓటర్ ను పరిశీలించడమనేది ఇస్లాం సంప్రదాయాలకు వ్యతిరేకమని మరికొందరు ఆరోపించారు. దీంతో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట మహిళా ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి ఐడెంటిఫికేషన్ గుర్తించే అంశంపై పెద్ద చర్చే మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపైనే ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. అయితే ఎన్నికల కమిషన్ ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన వివరణను ఇస్తుందో తెలియదు కానీ..హైదరాబాద్ పార్లమెంట్ కు ఈసారి జరిగిన పోలింగ్ తీరు మాత్రం హిజాబ్ విషయంలో అందరినీ ఆలోచింపజేసినట్లైంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version