HomeతెలంగాణEllamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం. దేశానికే సరికొత్త మోడల్ తీసుకొచ్చాం. ఇదే కదా కాలేశ్వరం విషయంలో గులాబీ పార్టీ నాయకులు చెప్పేది.

వాళ్ల సొంత ప్రచారం.. ఇతర వ్యవహారాలను పక్కనపెడితే.. ఇవాల్టికి తెలంగాణకు బలం గొలుసుకట్టు చెరువులు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాగు నిలబడింది. పంటలు పండడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రజల కడుపు నిండింది. పశువులకు దప్పిక తీరింది. ఈరోజుకు కూడా.. ఇంతటి ఆధునిక కాలంలో.. తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా నిలుస్తోంది.. దేశానికి పట్టడు అన్నం పెడుతుంది అంటే దానికి ప్రధాన కారణం గొలుసుకట్టు చెరువులు.

గొలుసుకట్టు చెరువుల్లో ఈ చెరువు ది ప్రత్యేకమైన స్థానం. ఒక రకంగా తెలంగాణకు మాత్రమే కాదు.. యావత్ దేశానికే ఆదర్శం.. మెతుకు సీమగా పేరు గాంచిన మెదక్ జిల్లాలోని బషీరాబాద్ మండలం మైల్వార్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎల్లమ్మ చెరువు సుప్రసిద్ధమైనది. ఇక్కడ రైతులు వెనుకాటి కాలం నుంచి నీటి వినియోగంలో పొదుపు మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ గ్రామం శివారు ప్రాంతంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీని కింద 250 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అయితే ఆయకట్టు రైతులు ఇక్కడి చెరువులో ఉన్న నీటిని నేరుగా వినియోగించుకోరు. తూములు ఉపయోగించరు. కాలువలలో కూడా నీటిని వాడరు.

ఇలా నీటిని వాడితే 50% వరకు వృధా అవుతుందని రైతులు భావిస్తుంటారు. అందువల్లే ఇక్కడి రైతులు కేవలం బోర్ల ద్వారా మాత్రమే పంట పొలాలు సాగు చేస్తుంటారు. ఈ చెరువులో నీటిని అలాగే ఉంచుతారు. ఈ చెరువు కింద దాదాపు 40 వరకు బోర్లు ఉన్నాయి. చెరువు నీటిని అలానే ఉంచడం వల్ల ఇక్కడ భూగర్భ జలాల మట్టం పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పది అడుగుల లోతరించే భూగర్భ జలాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరువు ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం బోర్లు సమృద్ధిగా పోస్తున్నాయి. రైతులు కూడా పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడ రైతులు వరి సాగులో నిమగ్నమై ఉన్నారు. చెరువులో నీటిని ఇక్కడ రైతులు నీటి బ్యాంక్ లాగా మార్చడం వల్లే ఇంతటి ఘనతను సాధిస్తున్నారు.

ఈ చెరువు నీళ్లపల్లి.. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ నీళ్లు అడవి జంతువులకు ప్రాణాదారంగా ఉంటాయి. ఇక్కడ చెరువులో నీళ్లు కాలాలతో సంబంధం లేకుండా మూగజీవాలు ఇక్కడికి వస్తుంటాయి. కేవలం పంటలు పండడమే కాకుండా.. మూగజీవాలకు కూడా ఈ చెరువు ఆధారంగా ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటువంటి విధానాలను కనుక రైతులు పాటించగలిగితే కచ్చితంగా ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పటికీ ఇబ్బంది ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper