HomeతెలంగాణCM Revanth Reddy : రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!

CM Revanth Reddy : రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు‘ అని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice Gavai) నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం (ఏప్రిల్‌ 2, 2025) విచారణలో ప్రస్తావించి, ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ(Assembly)లో ఇలాంటి ప్రకటనలు చేయడం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమేనని ధర్మాసనం ఆగ్రహించింది. ‘పవిత్రమైన చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయడం సరికాదు. ఇలాంటివి మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదు, కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది‘ అని జస్టిస్‌ గవాయ్, సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ(Mukul Rohathgi)ని ఉద్దేశించి హెచ్చరించారు. ‘మేం కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వడంలో నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అధికారాలు లేనివారం కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు విలువ ఉంటుంది, వాటిని కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి‘ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

బడ్జెట్‌ సమావేశాల్లో..
గత వారం అసెంబ్లీ బడ్జెట్‌(Asembly Budjet meetings) సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు‘ అని ప్రకటించారు. ‘బీఆర్‌ఎస్‌ నేతలు ఉప ఎన్నికలు వస్తాయని ఊదరగొడుతున్నారు, కానీ అవి ఎట్టిపరిస్థితుల్లోనూ రావు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? రాజ్యాంగం, స్పీకర్‌(Speaker) వ్యవస్థ అప్పటిలాగే ఉన్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఫిరాయింపు కేసును సూచిస్తూ, దాని అధికారాన్ని తేలిగ్గా తీసుకున్నట్లుగా భావించబడ్డాయి.

బాధ్యత ఉండాలి కదా..
సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా చూసింది. బీఆర్‌ఎస్‌(BRS)నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ వ్యాఖ్యలు కోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ‘చట్టసభలో చేసే ప్రకటనలు బాధ్యతాయుతంగా ఉండాలి‘ అని జస్టిస్‌ గవాయ్‌ హితవు పలికారు. ఈ వివాదం రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, రేవంత్‌ రెడ్డి తదుపరి చర్యలపై దృష్టి నెలకొంది.

Also Read : ఆ భూములు ప్రభుత్వానివా? HCU కు చెందినవా?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular