Bandi Sanjay singing video viral: అధికారులు, నాయకులు తమలోని కళను అదురుగా బయటపెడుతుంటారు. ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్క సమ్మక, సారలమ్మ జాతర సందర్భంగా పాటపాడారు. ఈ పాటకు సోషల్ మీడియాలో భారీగా వ్యూస్ వచ్చాయి. గతంలో కరీనగర్ కలెక్టర్గా పనిచేసిన పమేలా సత్పతి కూడా పాటపాడారు. తాజాగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సదర్భంగా సంఘ్ గీతాన్ని తాను ఆలపించి ప్రత్యేక ఆకర్షణ నిలిపారు. ఈ భక్తిరస పాట ద్వారా సంస్థ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తాయని సంఘ్ నేతలు చెబుతున్నారు.
సంఘ్తో అనుబంధం..
చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాల్గొని పెరిగిన సంజయ్, దేశభక్తి భావాలను గానం రూపంలో వ్యక్తీకరించారు. గతంలో హైదరాబాద్పై సెటైర్ పాట పాడారు. గతంలో హైదరాబాద్లో ’పారణి ఇంకా ఆరణలేదు’ అంటూ సెటైర్ పాటలు పాడి, స్టేజీలపై భావోద్వేగ గీతాలతో ఆకట్టుకున్నారు. ఈసారి ఆధ్యాత్మిక స్వరాలతో ప్రేక్షకులను అలరింపజేశారు.
కరీంనగర్లో విడుదల..
రామ నవమి పండుగ సందర్భంగా కరీంనగర్లో ఈ గీతాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొనే ఈ కార్యక్రమం రాజకీయ–సాంస్కృతిక ఉత్సవంగా మారనుంది.
సంగీతం ద్వారా ఆర్ఎస్ఎస్ వారసత్వాన్ని యువతకు అందించడం బండి సంజయ్ వినూత్న వ్యూహం. తెలంగాణలో బీజేపీ ఆదరణ పెంచడానికి, ప్రజలతో భావాత్మక సంబంధం ఏర్పరచడానికి ఇది సహాయపడుతుంది. రామ నవమి వేదికగా ఈ ప్రయత్నం పార్టీ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.
RSS శతజయంతి ఉత్సవాల సందర్భంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు పాడిన పాటలు.
శ్రీరామనవమి పర్వదినాన విడుదల! pic.twitter.com/O9jVGc9fCY— CHALLA VENU GOPAL YADAV (MODI JI KA FAN) (@VENUYADAV4BJP) March 26, 2026