కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు NGT బ్రేక్
తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలిపింది. జలశక్తిత ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత పనులు చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుతో విస్తృత ప్రయోజనాలున్నా పర్యావరణం కూడా అవసరమేనని తెలిపింది. పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలపై అధ్యయం చేయాలని […]
Written By:
, Updated On : October 20, 2020 / 12:53 PM IST

తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలిపింది. జలశక్తిత ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత పనులు చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుతో విస్తృత ప్రయోజనాలున్నా పర్యావరణం కూడా అవసరమేనని తెలిపింది. పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలపై అధ్యయం చేయాలని సూచించింది.