జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని వ్యాఖ్యానించాడు. గతంలో 4,700 ఎకరాలున్న హుస్సేన సాగర్ ప్రస్తుతం 700 ఎకరాల కూడా లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తానని మాయమాటలు చెప్పిందన్నారు. మరోవైపు ముషీరాబాద్ భోలక్ పూర్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అక్బరుద్దీన్ కు ఛేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.