తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 661 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,57,374 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,404గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,40,545 మంది కోలుకోగా ప్రస్తుతం 15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 12,888 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 21,264 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 48,74,433 కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.