Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAnthropic AI: ఆంథ్రోపిక్‌.. ఏఐలో ఓ సునామీ... దీంతో ఏమవుతుంది? ఏ మార్పులు రాబోతున్నాయి..

Anthropic AI: ఆంథ్రోపిక్‌.. ఏఐలో ఓ సునామీ… దీంతో ఏమవుతుంది? ఏ మార్పులు రాబోతున్నాయి..

Anthropic AI: ఏఐ.. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని హవానే. మంచి చెడుతో సంబంధం లేకుండా.. ఫలితాలు ఎలా ఉన్నా.. ఏఐని విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఇక ఈ ఏఐలో కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో అన్నిరంగాలు ఎఫెక్ట్‌ అవుతున్నాయి. సునామీలా దూసుకొస్తున్న ఏఐతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడెయ్‌ ఏఐని సునామీలా వర్ణించారు, సమాజమే సిద్ధంగా లేదని పేర్కొన్నారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో ఇంటర్వ్యూలో భారత ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, నైపుణ్యాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వేగవంతమైన పురోగతి..
ఐదేళ్ల క్రితం కంప్యూటర్‌తో వ్యాసం రాయించడం అసాధ్యమైనది, ఇప్పుడు మానవ మెదడు స్థాయికి ఏఐ చేరింది. డేటా, కంప్యూటింగ్‌ శక్తి పెరగడంతో సామర్థ్యం ఆకాశానికి తాకుతోంది. ఆర్థిక, భద్రతా ప్రభావాలు కొందరికి నచ్చడం లేదు. అపార్థం కొంటున్నారు. అపోహలు పెంచుతున్నారు. సురక్షిత ఏఐ కోసమే ఓపెన్‌ ఏఐ వదిలేసి ఆంథ్రోపిక్‌ స్థాపించామని డారియో వెల్లడించారు.

భారత్‌తో భాగస్వామ్యం
బహుళజాతి సంస్థలు భారత్‌ను కేవలం మార్కెట్‌గా చూస్తునర్నాయి. ఇప్పుడుఆంథ్రోపిక్‌ కూడా ఇలాగే భారత్‌తో భాగస్వామ్యం కోరుకుంటోంది. ఐటీ, కన్సల్టింగ్‌ కంపెనీలతో కలిసి పనిచేయాలని ఆంథ్రోపిక్‌ భావిస్తోంది. ఏపీఐలతో స్వదేశీ సేవలు బలపడతాయి. ఉద్యోగాలపై ఎలాంటిపభావం ఉండదని డారియో వెల్లడించారు. గత అక్టోబర్‌ నుంచి వాడుక, ఆదాయం రెట్టింపు అయింది.

స్టార్టప్‌లకు సూచనలు..
భారత స్టార్టప్‌లు ఏపీఐలతో సరళ యూఐలు కాకుండా ఫైనాన్స్, బయాలజీలో అనుకరణ సాధ్యం లేని పరిష్కారాలు రూపొందించాలని డారియో తెలిపారు. ప్రతి 2–3 నెలలకు కొత్త మోడల్స్‌ వాడుకుని వినూత్నతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. సంక్లిష్ట ఏఐలు మానవ నిర్ణయాలు తీసుకుంటాయని సింథటిక్‌ డేటా ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు. దీనిపై నియంత్రణ అవసరమన్నారు. బయాలజిస్టుగా డారియో, ఏఐతో క్యాన్సర్‌కు కీమో థెరపీలు, పెప్టైడ్‌ చికిత్సలు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కోడింగ్‌లాంటి సాఫ్ట్‌వేర్‌ పనులను ఏఐ ఆక్రమిస్తోంది. మానవ సంబంధాలు, భౌతిక పనులు, సంస్థల మధ్య సంనాదాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఫేక్‌ కంటెంట్‌ను గుర్తించే విమర్శనాత్మక ఆలోచన అవసరమని డారియో అభిప్రాయపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version