Homeక్రీడలుక్రికెట్‌Women's T20 World Cup 2024: హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఈసారైనా టి20 వరల్డ్...

Women’s T20 World Cup 2024: హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఈసారైనా టి20 వరల్డ్ కప్ తెస్తుందా..పొట్టి ఫార్మాట్ లో భారత మహిళల జట్టు పరిస్థితి ఎలా ఉందంటే?

Women’s t20 World Cup 2024: మూడు నెలల క్రితం రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై గెలుపొంది t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. దీంతో భారత అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అదరగొట్టాలని.. ఇప్పటిదాకా అందుకోలేక పోయిన ప్రపంచ కప్ దక్కించుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అయితే అది అంత సులభం కాదు. పరిమిత ఓవర్లలో ఆడే క్రికెట్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి వేరుగా ఉంటుంది. ఆడేది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా వారి అనురక్తి ఒకే విధంగా ఉంటుంది. టి20 క్రికెట్ అంటేనే వేగానికి, కొలమానం లాగా ఉంటుంది. అలాంటి సమయంలో టోర్నీ జరుగుతున్నన్నీ రోజులు అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. సరిగ్గా మూడు నెలల క్రితం జరిగిన టి20 వరల్డ్ కప్ భారత పురుషుల జట్టుకు ఒక మధురమైన జ్ఞాపకంలాగా నిలిచిపోయింది. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య హోదాలో బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్ తో తలపడుతుంది. తర్వాత జరిగే మరో మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. ఇక ఈ టోర్నీలో ఎప్పటిలాగే భారత జట్టు ఎన్నో ఆశలతో రంగంలోకి దిగుతోంది. భారత జట్టు రెండుసార్లు వన్డేలలో, ఒకసారి టి20 ఫైనల్ వెళ్లినప్పటికీ కప్ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారైనా కప్ సాధించాలని టీమిండియా భావిస్తోంది.

అంత తేలిక కాదు

భారత జట్టు గ్రూప్ – ఏ లో ఉంది. ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఆరుసార్లు ఛాంపియన్ గా అవతరించింది. ఇక మిగతా జట్లు కూడా బలంగానే ఉన్నాయి. అలాంటప్పుడు గ్రూప్ దశలో టాప్ -2 లో బలంగా నిలబడాలంటే హర్మన్ ప్రీత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా స్థిరమైన ఆటను కొనసాగించాలి. ప్రస్తుతం జట్టును చూస్తే గతంలో ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్ కు తోడుగా స్మృతి, షెఫాలి వర్మ, జెమిమా, రిచా లాంటి ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. దీప్తి, పూజ అటు బంతి, ఇటు బ్యాట్ తో సత్తా చాటగలరు. రేణుక, అరుంధతి, రాధా, ఆశా శోభన తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. యూఏఈ మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోగలరు. భారత జట్టు శుక్రవారం తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. ఆదివారం పాకిస్తాన్ జట్టుతో పోటీపడుతుంది.

దక్కించుకోలేకపోయింది..

ఇప్పటివరకు ఎనిమిది మహిళ టి20 ప్రపంచ కప్ లు జరిగాయి. అయితే ఇందులో ఆరు ఆస్ట్రేలియా దక్కించుకుంది. ఆస్ట్రేలియా సాధించిన ఈ ఆరు విజయాలలో ఎలిస్ పెర్రి ముఖ్యభూమిక పోషించింది. ఇప్పుడు కూడా ఆమె బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టి20 ప్రపంచ కప్ లు ఆడిన భారత్ 2020లో మాత్రమే ఫైనల్ చేరింది. 2009, 2010, 2018, 2023లో ఎస్ఎంఎస్ వరకు వెళ్ళింది. 2012, 2014, 2016లో తొలి రౌండు లోనే నిష్క్రమించింది. ప్రస్తుత టి20 ప్రపంచకప్ లో 43 వికెట్లతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షబ్నం ఇస్మాయిల్ 43 వికెట్లు సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ బ్యాటర్ సుజి బెట్స్ 1,066 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version