Vaibhav Suryavanshi: టీమిండియాతో పోల్చి చూస్తే ఐర్లాండ్ పెద్ద జట్టు కాదు. ఐర్లాండ్ జట్టుకు అంత సీన్ లేదు. కానీ, టి20 వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియాను ఐర్లాండ్ ఓడించింది. అది కూడా భారీ అంతరంతో. పెద్ద పెద్ద జట్లను ఓడించి.. టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా చేతులెత్తేయడం సగటు అభిమానికి మింగుడు పడలేదు. అంతేకాదు.. టీమిండియా కూర్పు విషయంలో కూడా మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. అందువల్లే టీమిండియా ఓడిపోవలసి వచ్చింది.
టీమిండియాలో అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే వాషింగ్టన్ సుందర్ వరకు పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. జట్టులో ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ అయ్యర్ దారుణంగా నిరాశపరిచాడు. దీనికి తోడు మిగతా ప్లేయర్లు కూడా సరిగా ఆడలేక పోవడంతో ఐర్లాండ్ ముందు టీమిండియా తలవంచు కోవాల్సి వచ్చింది. టీమిండియా ఓటమికి బౌలర్లలో ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ కారణమైతే.. బ్యాటింగ్ లో సంజు, సుందర్, అక్షర్, తిలక్, అయ్యర్ వంటి వారు ప్రధాన కారణం. ఇలా సమష్టి విఫల ప్రదర్శనతో టీమిండియా ఓటమిపాలైంది.
ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వాస్తవానికి టీమిండియా తరఫున వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అందరూ అనుకున్నారు. మేనేజ్మెంట్ కూడా అతని మీద ప్రత్యేకమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వదిలింది. ఐర్లాండ్ లో స్థిరపడిన భారతీయులు కూడా సూర్య వంశీ ఆట తీరు చూసేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లు భారీగా కొనుగోలు చేశారు. మేనేజ్మెంట్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ వల్లే సూర్య వంశీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్లో సూర్య వంశీకి జట్టులో చోటు కల్పించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. అతడికి చోటు కల్పించి.. తొలి ఓటమి నుంచి టీమిడియాకు ఉపశమనం కలిగించాలని అభిమానులు కోరుతున్నారు.
ఎందుకంటే ఇటీవల కాలంలో సూర్య వంశీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంక లో శ్రీలంక జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సూర్య వంశీ టీమ్ ఇండియన్ గెలిపించాడు. అతడి ఆట తీరు గుర్తించి రెండవ మ్యాచ్లో అవకాశం కల్పించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్య వంశీ కూడా జాతీయ జట్టు తరఫున ఆడాలని బలంగా కోరుకుంటున్నాడు. స్వదేశీ మైదానాల మీదనే కాకుండా.. విదేశీ మైదానాల మీద అదరగొట్టాలని భావిస్తున్నాడు. అతనికి గనక అవకాశం లభిస్తే ఊరుకోడు. పైగా తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోవడంతో.. అతడు కసి మీద ఉన్నాడు. తన కసి మొత్తాన్ని ఐర్లాండ్ బౌలర్ల మీద తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. మరి గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో చూడాల్సి ఉంది.
