Homeక్రీడలుIndia Vs Zimbabwe 2024: తెలుగు కుర్రాడికి భలే ఛాన్స్.. జింబాబ్వే సిరీస్ కు టీమిండియా...

India Vs Zimbabwe 2024: తెలుగు కుర్రాడికి భలే ఛాన్స్.. జింబాబ్వే సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే..

india vs zimbabwe 2024: టి20 వరల్డ్ కప్ తర్వాత.. భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఇందులో భాగంగా టి20 సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్ మన్ గిల్ సారధ్యం వహిస్తాడు. గత కొద్దిరోజులుగా తీరికలేని ఆట ఆడుతున్న సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. పూర్తిగా జూనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. టి 20 టోర్నీలో భారత్ 5 మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్ లు మొత్తం జింబాబ్వే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నిమిషాలకు మ్యాచ్ లు మొదలవుతాయి. జూలై 7న తొలి మ్యాచ్ జరుగుతుంది. జూలై 14తో సిరీస్ పూర్తవుతుంది.

ఈ సిరీస్ కు బీసీసీఐ అనేక ప్రయోగాలు చేసింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, పూర్తిగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.. టి20 ప్రపంచ కప్ లో ప్లేయింగ్ -11 లో ఉన్న ఏ ఒక్క ఆటగాడికి కూడా ఈ సిరీస్ లో బీసీసీఐ అవకాశం కల్పించలేదు. ఇక తెలుగు కుర్రాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు నితీష్ రెడ్డికి ఈ సిరీస్ లో అవకాశం దక్కింది. ఇతడితోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన తుషార్ దేశ్ పాండే, రాజస్థాన్ జట్టుకు చెందిన రియాన్ పరాగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన అభిషేక్ శర్మ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.. జితేష్ శర్మ, సంజు సాంసన్ కు వికెట్ కీపర్లుగా అవకాశం లభించింది. ఈ సిరీస్ లో ఐదు టి 20 మ్యాచ్ లు ఉన్నాయి.

ఈ సిరీస్ లో మరో ఆటగాళ్లు భారత జట్టులోకి పున: ప్రవేశం పొందారు. రుతురాజ్ గైక్వాడ్ కు మరో అవకాశం దక్కింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ కు మళ్లీ స్థానం దక్కింది.. అయితే కేఎల్ రాహుల్ కు మాత్రం అవకాశం లభించలేదు. టి20 వరల్డ్ కప్ లోనూ అతడికి స్థానం లభించలేదు. జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని పరిగణలోకి తీసుకోలేదు.

జింబాబ్వేలో పర్యటించే
భారత జట్టు ఇదే

శుభ్ మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

ఇక ఈ సిరీస్ లో భాగంగా జులై 6న మొదటి టీ20, ఏడవ తేదీన రెండవ టి20, పదవ తేదీన మూడో టి20, 13వ తేదీన నాలుగో t20, 14న ఐదవ టి20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు మొత్తం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version