Homeక్రీడలుక్రికెట్‌Saina Nehwal - Jaspreet bumrah : నేను కొడితే జస్ ప్రీత్ బుమ్రా తట్టుకోలేడు.....

Saina Nehwal – Jaspreet bumrah : నేను కొడితే జస్ ప్రీత్ బుమ్రా తట్టుకోలేడు.. సైనా నెహ్వాల్ సంచలన వ్యాఖ్యలు..

Saina Nehwal – Jaspreet bumrah: సోషల్ మీడియాలో క్రీడాకారులు చేసే ట్వీట్లకు విపరీతమైన స్పందన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో క్రీడాకారులు చేసే ట్వీట్లు సంచలనం అవుతుంటాయి. అలా మనదేశంలోని స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె చేసిన ట్వీట్ శనివారం మొత్తం ట్రెండింగ్ లోనే ఉంది. ఆమె ట్వీట్ చేయడం.. ఇతర ఆటగాళ్లు స్పందించడంతో నెటిజన్లు ఆసక్తిగా గమనించారు. కొందరు వాటిని రీ ట్వీట్ చేశారు. మరికొందరు తమదైన శైలిలో కామెంట్ చేశారు. అయితే సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్లు పలు స్పోర్ట్స్ చానల్స్ కు మంచి మసాలా లాంటి కంటెంట్ అందించాయి.. ఇంతకీ సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ ఎందుకు ట్వీట్ చేశారు.. మిగతా ఆటగాళ్లు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన ప్రతిభతో బ్యాడ్మింటన్ లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఇతర క్రీడలను క్రికెట్ తో సరితూస్తూ కామెంట్ వ్యాఖ్యలు చేసింది. అవి నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీశాయి. శారీరకంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రికెట్ కంటే అత్యంత కష్టంగా ఉంటాయని సైనా పేర్కొంది. ఈ వ్యాఖ్యల పట్ల యువ క్రికెటర్ రఘవంశీ స్పందించాడు. దీనికి సరైన సమాధానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతడి వెంటనే దానిని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. రఘు వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల మరోసారి సైనా నెహ్వాల్ స్పందించింది. కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

“జస్ ప్రీత్ బుమ్రా వేగంగా బంతులు వేస్తాడు. అతడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తే సైనా తట్టుకుంటుందా? ఏమో ఇలాంటి వాటిని చూడాలి” అని రఘువంశి ట్వీట్ చేశాడు. ఆ తర్వాత డిలీట్ చేశారు. దానిపై సైనా స్పందించింది. ” నువ్వు క్రికెటర్ వే కదా. నువ్వు కూడా ఆడుతున్నావు కదా. విరాట్ కోహ్లీ లాగా క్రికెట్ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పగలవా. లేకుంటే రోహిత్ లాగా దూకుడుగా బ్యాటింగ్ చేయగలవా. రోహిత్, కోహ్లీ మాదిరి ఆడాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అవ్వడం కష్టం. అతి కొంతమంది మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. అది మొత్తం వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇక భవన విషయానికి వస్తే.. వారి శ్రమను నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ నేను ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ కనుక ఆడుతూ ఉండి ఉంటుంటే కచ్చితంగా బుమ్రా ను ఎదుర్కొని ఉండేదాన్ని. ఇదే సమయంలో బుమ్రా కనుక బ్యాడ్మింటన్ ఆడి ఉంటే నేను కొట్టే స్మాష్ లను అతడు అడ్డుకొని ఉండేవాడు కాదు. మనం దేశం కోసం ఆడుతున్నాం. మనం పేరుపొందిన ఆటగాళ్ళం. అలాంటప్పుడు ఇలాంటి విషయాల మీద పోరాడుకోవాల్సిన అవసరం లేదని” సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.. ప్రతి క్రీడను అత్యుత్తమమైనదిగా నెహ్వాల్ అభివర్ణించింది. ఇతర క్రీడలకు కూడా విలువ ఇవ్వాలని కోరింది. అలా జరగకపోతే క్రీడా సంప్రదాయం వర్ధిల్లదని వాపోయింది. అలాంటి మనసు కనుక లేకుంటే బాలీవుడ్, క్రికెట్ పై మాత్రమే అందరి దృష్టి ఉంటుందని సైనా నెహ్వాల్ కుండబద్దలు కొట్టింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Oktelugu Epaper
Exit mobile version