Lucknow IPL Team Coach Update: రిషబ్ పంత్ ఢిల్లీకి వెళ్లిపోతున్నాడు. ఢిల్లీ నుంచి కులదీప్ యాదవ్ వస్తున్నాడు. ఇంతవరకే లక్నో జట్టు గురించి అప్డేట్ తెలుసు. 2027 ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపాలని లక్నో జట్టు ఇప్పటినుంచే బలమైన ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది.
లక్నో జట్టు కేవలం ప్లేయర్ల విషయంలోనే కాదు.. ప్లేయర్లకు శిక్షణ ఇచ్చే కోచ్ ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నది. ఈ క్రమంలోనే మెరుగైన ట్రాక్ రికార్డు ఉన్న మాజీ ప్లేయర్లను శిక్షకుల జాబితాలోకి తీసుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన మాజీ ఆటగాడిని సంప్రదించినట్టు తెలుస్తోంది. అతడు కూడా దానికి ఓకే చెప్పడంతో.. త్వరలోనే అతడు జట్టులో ప్రవేశించే అవకాశం ఉంది.
కేరళ నేపథ్యం ఉన్న జయ కుమార్ అనే ఆటగాడిని లక్నో జట్టు బ్యాటింగ్ విభాగంలో కోచ్ గా నియమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతడు త్వరలోనే జట్టులో చేరుతాడని.. దేశీయ ఆటగాళ్లతో కలిసి పని చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లక్నో జట్టుకు డాక్టర్ ఆఫ్ క్రికెట్ గా టామ్ మూడీ.. హెడ్ కోచ్ గా జస్టిన్ లాంగర్.. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో త్వరలోనే విజయ్ కుమార్ చేరబోతున్నాడు. మొదట్లో దక్షిణాఫ్రికా లెజెండ్ ఆటగాడు క్లూసెనర్ ఈ జట్టులో భాగమవుతాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జయకుమార్ వైపే లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా మొగ్గు చూపాడని తెలుస్తోంది.
లక్నో జట్టులో కీలకమైన ప్లేయర్లుగా ఉన్న హిమ్మత్ సింగ్.. ముకుల్ చౌదరి.. అక్షత్ రఘు వంశీ.. అబ్దుల్ సమద్.. ఆయుష్ బదోని.. అర్షిన్ కులకర్ణి వంటి ప్లేయర్లను లక్నో యాజమాన్యం వచ్చేవారం ఆస్ట్రేలియాకు పంపిస్తోంది.. వారంతా కూడా లాంగర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతారు. అక్కడ పూర్తయిన తర్వాత వాళ్లు చెన్నై వస్తారు. అక్కడ జయకుమార్ వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాడు. జయ కుమార్ ఆధ్వర్యంలోనే సాయి సుదర్శన్ ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు..
