IPL 2026: ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈసారి అన్ని జట్లు ప్లేయర్ల విషయంలో జాగ్రత్త పాటించాయి. బౌలర్లు.. స్టార్ బ్యాటర్లు.. ఆల్ రౌండర్లను కొనుగోలు చేశాయి. ఫలితంగా ఈసారి పోటీ అత్యంత రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపించిన ప్లేయర్లకు ఈసారి అన్ని జట్లు అవకాశాలు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ లో విదేశీ ప్లేయర్లు కూడా సందడి చేస్తుంటారు. అయితే ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందుగానే భారీ అంచనాలు ఉన్న విదేశీ బౌలర్లు గాయపడ్డారు. దీంతో వారు ఏకంగా టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్ జట్టు తరఫున సామ్ కరణ్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్ అయిన ఇతడు.. గాయపడ్డాడు. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తోంది. ఒకరకంగా రాజస్థాన్ జట్టుకు ఇది భారీ దెబ్బ.. కరణ్ ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు.. ఇంగ్లాండ్ జట్టు తరఫున మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు గాయపడడంతో రాజస్థాన్ జట్టు మెరుగైన ఆల్రౌండర్ ను కోల్పోయింది.
పంజాబ్ జట్టు కూడా ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. పంజాబ్ జట్టు కు ఫెర్గు సన్ దూరమయ్యాడు. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు చెందిన ఈ ఆటగాడు.. బౌలింగ్ తో పాటు.. బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఇతడికి ఎటువంటి గాయం కాకపోయినప్పటికీ.. ఇటీవల అతడు తండ్రి కావడం.. బిడ్డతో గడిపేందుకు స్వదేశానికి వెళ్ళాడు. దీంతో ప్రారంభంలో అతడు కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read: ఫిదా చేశావురా బుడ్డోడా.. కమ్ బ్యాక్ అంటే ఇదీ..
ఇక బెంగళూరు జట్టు కు కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈ జట్టులో కీలకమైన బౌలర్గా ఉన్న హెజిల్ వుడ్ గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది. అతడు గత సీజన్లో అదరగొట్టాడు. బెంగళూరుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడు గాయపడిన నేపథ్యంలో.. బెంగళూరు బౌలింగ్ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారధిగా ఉన్న కమిన్స్ గాయపడ్డాడు. కొంతకాలంగా అతడు తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం అతడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. యాషెస్ సిరీస్ లో ఒకే మ్యాచ్ మాత్రమే ఆడాడు కమిన్స్. టి20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు దూరం మాత్రమే కాదు.. కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే హేజిల్ వుడ్, కమిన్స్ గాయపడిన నేపథ్యంలో.. వారు టోర్నీ మొత్తానికి దూరం కాలేదని.. కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడరని.. ఆ తర్వాత వారు ఆయా జట్లకు అందుబాటులోకి వస్తారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
