Homeక్రీడలుక్రికెట్‌India Vs Australia 2nd Test: తెలుగోడు మళ్లీ ఆదుకున్నాడు.. అడి లైడ్ పింక్ బాల్...

India Vs Australia 2nd Test: తెలుగోడు మళ్లీ ఆదుకున్నాడు.. అడి లైడ్ పింక్ బాల్ టెస్ట్ లో భారత్ పరిస్థితి ఏంటంటే?

India Vs Australia 2nd Test: ఊహించినట్టుగానే అడిలైడ్ మైదానం పేస్ బౌలింగ్ కు స్వర్గధామం లాగా మారింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడం అతిపెద్ద తప్పిదమైంది. ఖాతా తెరవకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టు ఇన్నింగ్స్ లో 161 రన్స్ చేసిన యశస్వి జైస్వాల్ ఈసారి 0 పరుగులకే అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (37), గిల్(31) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 7, రోహిత్ శర్మ 3 దారుణంగా విఫలమయ్యారు. ఈ దశలో రిషబ్ పంత్ 21 ఆకట్టుకున్నాడు. అశ్విన్ 22 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఈసారి కూడా ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. 42 పరుగులతో రాణించాడు. ఫలితంగా టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. టీమిండియాలో జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా 0 పరుగులకే అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.

పేస్ బౌలర్లు అదరగొట్టారు

ఈ మైదానంపై ఊహించిన విధంగానే పేస్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్క్ అద్భుతమైన బంతులు వేస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లను వణికించాడు. మైదానంపై తేమ వుండడం తో అద్భుతమైన పేస్ రాబట్టాడు. పెర్త్ టెస్టులో హేజిల్ వుడ్ మాదిరిగానే.. అడిలైడ్ టెస్టులో స్టార్క్ బౌలింగ్ వేసాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులు వేసి ఇబ్బంది పెట్టాడు. ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేసి టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. గతంలో ఈ మైదానంపై డే అండ్ నైట్ మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియా రెండవ 36 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈసారి టీమిండియా ఆటగాళ్లు నిదానంగా ఆడారు. భారీ స్కోరు చేయకపోయినప్పటికీ.. ఉన్నంతలో మెరుగ్గానే బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయినప్పటికీ.. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ భారత జట్టుకు కీలకంగా నిలిచింది. హాఫ్ సెంచరీ చేయలేకపోయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినమైన పరిస్థితుల్లోనూ నితీష్ కుమార్ రెడ్డి గట్టిగా నిలబడ్డాడని.. టీమిండియా మెరుగైన స్కోర్ సాధించేలా కృషి చేశాడని అభిమానులు సామాజిక మాధ్యమాలలో కొనియాడుతున్నారు. హాఫ్ సెంచరీ చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version